తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నించింది.
తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 'తలైవన్', 'కరైయోరం', 'నారదన్', 'భాస్కర్ ఒరు రాస్కెల్' వంటి చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ జీవీ ప్రకాష్ సరసన ఓ కొత్త చిత్రలో నటిస్తోంది. దర్శకుడు ఎలిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో నికిషా పటేల్ కి రహస్యంగా ఆపరేషన్ జరిగిందని, ఎవరికీ తెలియనివ్వకుండా ముంబైలో సైలెంట్ గా ఆపరేషన్ కానిచ్చేశారని వార్తలు వినిపించాయి.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. తాజాగా నికిషా పటేల్ ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు ఆపరేషన్ జరిగిన మాట నిజమేనని వెల్లడించింది. తనకు చిన్న సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపింది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు తొందరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఎలిల్ సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
So i was hospitalised and had surgery last few days so wasn't able to post up but I wrapped up my portion for ezhil sir film with these two sweeties @actorsathish @gvprakash ! Sweet shoot starting my next after recovery. pic.twitter.com/g32iCtgHHc
— Nikesha Patel (@NikeshaPatel) April 26, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 30, 2019, 12:21 PM IST