Asianet News TeluguAsianet News Telugu

తిరుమల శ్రీవారిని సేవలో నమిత దంపతులు.. ఇంట్రెస్టింగ్‌ కెరీర్‌ అప్‌డేట్స్..

నటి నమిత దంపతులు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకోగా, వీరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

actress namitha visits tirumala with husband  arj
Author
Hyderabad, First Published Jul 10, 2021, 1:55 PM IST

తెలుగులో బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌ వంటి స్టార్లతో మెరిసిన నమిత తాజాగా తిరుమల శ్రీవారి సేవలో సేద తీరారు. శనివారం నమిత దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకోగా, వీరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాసేపు తిరుమల శ్రీవారి పరిసరాలను ఆస్వాధించారు. నమిత 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

తాను నటించిన `బౌ బౌ` అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అయితే దాన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేయలా? ఓటీటీలో తీసుకురావాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అంతేకాదు త్వరలోనే ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే తాను ఓటీటీని లాంచ్‌ చేస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. నమితా థియేటర్‌ పేరుతో ఓటీటీని, నమిత ప్రొడక్షన్ ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. 

`సొంతం` చిత్రంలో తెలుగులో నటిగా అడుగుపెట్టిన నమిత `జెమినీ` చిత్రంలో వెంకీతో జోడి కట్టింది. రవితేజకు జోడీగా `ఒక రాజు ఒక రాణి` సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ప్రభాస్‌తో `బిల్లా` చిత్రంలో నటించి బికినీలో అనుష్కకి పోటీగా అందాల విందు వడ్డించింది. స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం తగ్గలేదీ భామ. బాలకృష్ణతో `సింహ`లోనూ హాట్‌ షో చేసింది. ఇలా సెకండ్‌ హీరోయిన్‌గా, వ్యాంప్‌ తరహా పాత్రలతో మెరిసింది. సిల్వర్ స్క్రీన్ పై కాదు.. టీవీ రియాలిటీ షోల్లో జడ్జ్‌గా పలు షోలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios