మీనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలి, అని మీనా అన్నారు.
సీనియర్ హీరోయిన్ మీనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.బిగ్ బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి, నేడు చెన్నై సైదాపేట్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు ఆమె మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలి, అని మీనా అన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ కన్నడ హీరో సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మీనా రజినీ కాంత్- శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీ నటిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 18, 2021, 1:45 PM IST