Asianet News TeluguAsianet News Telugu

దుమారం రేపుతున్న కంగనా లేటెస్ట్ కామెంట్స్... ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

బీజేపీ సానుభూతిపరురాలిగా పేరున్న కంగనా మాటలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్కా ఆధారాలు ఉండగా అవి నైజీరియా దేశంలో  జరిగిన సంఘటనల ఫోటోలు అని ఎలా అంటారని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కంగనాను తెగ ట్రోల్ చేస్తున్నారు.

 

Actress kangana ranaut getting trolled for her latest comments ksr
Author
Hyderabad, First Published May 17, 2021, 10:56 AM IST

వివాదాస్పద నటి కంగనా రనౌత్ వాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేశంలో కరోనా విళయతాండవం చేస్తుంది. రోజుకు లక్షల్లో మరణాలు సంభవిస్తుండగా వేలల్లో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే దుర్భర పరిస్థితి నెలకొంది.

ఆసుపత్రులు, స్మశాన వాటికలు కరోనా శవాలతో నిండిపోతున్నాయి. కాగా యూపీ, బీహార్ రాష్ట్రాల్లో గంగానదిలో పదుల సంఖ్యలో శవాలు కొట్టుకువచ్చాయి. పలుమార్లు జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. మానవ హక్కుల కమీషన్ సైతం దీనిపై సీరియస్ కావడం జరిగింది.

ఐతే నదిలో కొట్టుకు వచ్చిన శవాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉద్దేశిస్తూ కంగనా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గంగా నదిలో శవాలు కొట్టుకు వచ్చాయన్న వార్తలలో నిజం లేదని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోలు నైజీరియా దేశంలో జరిగిన సంఘటనలకు సంబంధించినవి అని అన్నారు.

బీజేపీ సానుభూతిపరురాలిగా పేరున్న కంగనా మాటలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్కా ఆధారాలు ఉండగా అవి నైజీరియా దేశంలో  జరిగిన సంఘటనల ఫోటోలు అని ఎలా అంటారని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కంగనాను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios