మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం
నటుడు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మోహన్బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్లో గురువారం ఉదయం ఆరు గంటలకు మంచు లక్ష్మమ్మ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి.