ఆనందయ్య మందు తీసుకున్నా.. నాకు కరోనా రాలేదుః జగపతిబాబు
ఆనందయ్య మందుని తాను ఇప్పటికే తీసుకున్నానని, తనకు ఇప్పటి వరకు ఎలాంటి కరోనా రాలేదని చెబుతున్నారు నటుడు జగపతిబాబు. నెల్లూరులోని కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య మందు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఆనందయ్య మందుని తాను ఇప్పటికే తీసుకున్నానని, తనకు ఇప్పటి వరకు ఎలాంటి కరోనా రాలేదని చెబుతున్నారు నటుడు జగపతిబాబు. నెల్లూరులోని కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య మందు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కరోనాకి ఆనందయ్య అందించే పసరు మందు బాగా పనిచేస్తుందని ప్రచారం జరుగుతోంది. హైకోర్ట్ కూడా ఈ మందుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నచ్చిన వాళ్లు ఈ మందుని తీసుకోవచ్చని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ మందు అందించేందుకు సహకరించాల్సి వస్తోంది.
సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై నటుడు జగపతిబాబు స్పందించారు. తాను ఈ మందుని తీసుకున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, `ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో నేను కూడా ఒకడిని. ఆయుర్వేద తప్పు చేయదని నా నమ్మకం. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలుసుకున్న తర్వాతే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో డోస్ తీసుకున్నా. ఇప్పటివరకూ నాకెలాంటి కరోనా రాలేదు` అని జగపతిబాబు తెలిపారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో, వరుసగా ఆఫర్లతో దూసుకుపోతున్నారు జగపతిబాబు. ప్రస్తుతం ఆయన నాని చిత్రం `టక్ జగదీష్`, `రిపబ్లిక్`, `గుడ్లక్ సఖీ`, `గని`, `పుష్ప`, `మహాసముద్రం`, `లక్ష్యా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.