‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా... ఇప్పటి వరకు జరిగిన షూటింగ్తో 40 శాతం షూటింగ్ పూర్తియింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్ర షూటింగ్ని నిరవధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది. అయితే అతి త్వరలోనే షూటింగ్ని ప్రారంభించాలని, చిరుకు సంబంధించిన కీలక ఘట్టాలని పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.
‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ప్రమఖ దర్శకుడు... కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా... ఇప్పటి వరకు జరిగిన షూటింగ్తో 40 శాతం షూటింగ్ పూర్తియింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్ర షూటింగ్ని నిరవధికంగా చిత్రం టీమ్ నిలిపివేసింది. అయితే అతి త్వరలోనే షూటింగ్ని ప్రారంభించాలని, చిరుకు సంబంధించిన కీలక ఘట్టాలని పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయటానికి సైతం సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 22న చిరంజీవిత తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ రాబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండోమెంట్ అధికారిగా చిరంజీవి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మరో కీలక అతిథి పాత్రలో హీరో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించనున్నారు.
ఇక చిరంజీవి మరో ప్రక్క జిమ్లో కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా టైటిల్ ను ప్రకటించినప్పటి నుంచి చిరు సినిమాలో అనేక మంది స్టార్స్,నటులు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివకు కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవటమే కలిసొచ్చే అంసం. ఆయన ప్రతీ సినిమా ఆ హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి. పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.