హరీష్ శంకర్ సినిమా క్యాన్సిల్ అయిందా..?
హారీష్ శంకర్ రూపొందించిన 'డీజే' సినిమా విడుదలయ్యి ఏడాదిన్నర కాలం దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మరో సినిమా మొదలుపెట్టలేదు.
హారీష్ శంకర్ రూపొందించిన 'డీజే' సినిమా విడుదలయ్యి ఏడాదిన్నర కాలం దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ డైరెక్టర్ మరో సినిమా మొదలుపెట్టలేదు. దిల్ రాజు కాంపౌండ్ లో సినిమా చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు.
దీంతో బయటకొచ్చి 14 రీల్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళంలో హిట్ అయిన 'జిగర్తండా' సినిమాకురీమేక్ ని తీయాలనుకున్నాడు. కథ ప్రకారం ప్రధానంగా ఇద్దరు నటుడు అవసరం ఉండడంతో వరుణ్ తేజ్ ని ఒక నటుడిగా ఎంపిక చేసుకున్నాడు. నెగెటివ్ రోల్ కావడంతో వరుణ్కూడా ట్రై చేయాలనుకున్నాడు.
కానీ ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే మాటలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. 14 రీల్స్ సంస్థ ఇప్పుడు సినిమాలు చేసే మూడ్ లో లేదని ఒకపక్క, హీరోలకు ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం లేక ఎవరూ ఒప్పుకోవడం లేదని మరో పక్క వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరోలందరూ బిజీగా ఉండడం హరీష్ కి హీరో దొరకడం లేదు.
దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఇప్పుడు ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నా.. హీరోలు డేట్స్ మాత్రం దొరకడం లేదు. చాలా మంది మీడియం రేంజ్, అగ్ర దర్శకులు సైతం హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో హరీష్ హీరోని సెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడట.