సారాంశం

తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ మ్యానియా కనిపిస్తోంది.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. 

తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ మ్యానియా కనిపిస్తోంది. కనీవినీ ఎరుగని విధంగా తిరుపతిలో ఏకంగా రూ 4 కోట్ల ఖర్చుతో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ కూడా అదిరిపోయింది. దీనితో ఆల్రెడీ  హైప్ వచ్చేసింది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ జానకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కాబట్టి చిత్ర యూనిట్ ఎంతో భక్తి శ్రద్దలతో వ్యవహరిస్తున్నారు. 

ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్స్ లో శ్రీరాముడికి పరమ భక్తుడు అయిన హనుమంతుడి కోసం ఒక సీటు డెడికేట్ చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ చిత్రం విషయంలో కార్తికేయ 2 నిర్మాత, వరుసగా పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 10 వేల టికెట్స్ తన తరుపున ఉచితంగా అందించబోతున్నట్లు ప్రకటించారు. ఇది సంచలన నిర్ణయం అనే చెప్పొచ్చు. ఆ ఖర్చు ఆయనే భరించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడిపై భక్తితో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

 

అయితే ఈ అవకాశం అందరికీ కాదు.. తెలంగాణాలో ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ వారికి మాత్రమే లభిస్తుంది. దీనికోసం వారు అభిషేక్ అగర్వాల్ పోస్ట్ చేసిన గూగుల్ ఫామ్ నింపి అప్లై చేసుకుంటే నేరుగా వారికే ఆదిపురుష్ టికెట్స్ పంపిస్తారు. 

గొప్ప నిర్ణయం తీసుకున్న అభిషేక్ అగర్వాల్ ని ప్రతి ఒక్కరూ అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.