Asianet News TeluguAsianet News Telugu

చిరు కోసం గవర్నమెంట్ ఆఫీస్ రెడీ

లాక్ డౌన్ కు ముందే ఈ చిత్రం  30% షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలంగాణా గవర్నమెంట్ షూటింగ్ లకు ఫర్మిషన్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొనటం చిరుకు ఇంట్రస్ట్ లేదు. అలాగని పనులు ప్రక్కన పెట్టాలనే ఆలోచన కొరటాల శివకు లేదు. దాంతో ఆయన సినిమాకు సంభందించిన సెట్స్ వేయించటంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా నిమిత్తం గవర్నమెంట్ ఆఫీస్ సెట్ వేయిస్తున్నారు. ఎప్పుడైతే షూటింగ్ లు మొదలెడతారో అప్పుడు ఇక్కడే ప్రారంభం అవుతుంది. 

A Government Office for Megastar Chiranjeevi?
Author
Hyderabad, First Published Aug 3, 2020, 9:02 AM IST

కరోనా మహమ్మారితో మెగా స్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ఆచార్య ని ఫోస్ట్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే ఈ చిత్రం  30% షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలంగాణా గవర్నమెంట్ షూటింగ్ లకు ఫర్మిషన్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొనటం చిరుకు ఇంట్రస్ట్ లేదు. అలాగని పనులు ప్రక్కన పెట్టాలనే ఆలోచన కొరటాల శివకు లేదు. దాంతో ఆయన సినిమాకు సంభందించిన సెట్స్ వేయించటంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా నిమిత్తం గవర్నమెంట్ ఆఫీస్ సెట్ వేయిస్తున్నారు. ఎప్పుడైతే షూటింగ్ లు మొదలెడతారో అప్పుడు ఇక్కడే ప్రారంభం అవుతుంది. 
 
ఇక ఈ సినిమాను చిరంజీవి కుమారుడు మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, నిరంజన్‌రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కాజల్‌‌ అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇది చిరంజీవికి 153 వ సినిమా. రకరకాల కారణాలతో  లేట్ గా  మొదలైన ఈ ఆచార్య షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అవుతోంది. దీన్ని దాటేందుకు పక్కా ప్రణాళికతో చిరు, కొరటాల రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పక్కా యాక్షన్ ప్లాన్ తో కొరటాల రావటంతో చిరు దాన్ని అమలు చేస్తున్నారంటున్నారు. 

అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెలలోనే ఆచార్య  సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే కొరటాల కసరత్తులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ చిత్రం ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో అయిన మేరకు షూటింగ్, మిగతా వర్క్ ఫినిష్ చేయాలని కొరటాల భావిస్తున్నారు.  

ఇక చిరంజీవి మరో ప్రక్క జిమ్‌లో కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా టైటిల్ ను ప్రకటించినప్పటి నుంచి చిరు సినిమాలో అనేక మంది స్టార్స్,నటులు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కొరటాల శివకు కెరీర్ లో  ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవటమే కలిసొచ్చే అంసం. ఆయన ప్రతీ సినిమా ఆ హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి.  పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios