రజనీ ‘2.0’చైనా రిలీజ్, షాకింగ్ రిజల్ట్!
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘2.ఓ’.రీసెంట్ గా చైనాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ప్రేక్షకులను నుంచి మిక్సెడ్ టాక్ లభిస్తోంది.
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘2.ఓ’.రీసెంట్ గా చైనాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ప్రేక్షకులను నుంచి మిక్సెడ్ టాక్ లభిస్తోంది. గత శుక్రవారం ‘2.ఓ’ చైనాలో విడుదల కాగా, మూడు రోజుల్లో రూ.18కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రాన్ని చైనాలో భారీగా విడుదల చేశారు.
తొలిరోజు ఏకంగా 50వేలకు పైగా తెరలపై ప్రదర్శించగా, చైనీయుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవటంతో నిర్మాతకు నిరాశ పడ్డారు. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద 1.4మిలియన్ డాలర్లు, రెండో రోజు 7,20,000 డాలర్లు, మూడు రోజు 3,90,000డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా మూడు రోజుల బాక్సాఫీస్ వసూళ్లు చూసుకుంటే, 2.48మిలియన్ డాలర్లు వసూలు చేసింది. చూడటానికి ఇవి డీసెంట్ నెంబర్స్ లా కనిపించినా 48000 స్క్రీన్స్ లో రిలీజ్ అన్నదానితో పోలిస్తే బాగా డల్ గా కలెక్ట్ చేసినట్లే. దాంతో ఈ చిత్రం అక్కడ డిజాస్టర్ రిజల్ట్ వచ్చినట్లుగా ట్రేడ్ ఖరారు చేసింది.
ఈ చిత్రం 2018లో భారత్లో విడుదలైంది. అయితే అదే సమయంలో చైనాలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. ‘ది లయన్ కింగ్’ విడుదల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2.ఓ దాదాపు రూ.500కోట్లకు పైగా వసూలు చేసింది.
రజనీ కాంత్ ఈ చిత్రంలో చిట్టి, వశీకరణ్ అనే పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ విలన్ పాత్రలో కనిపించారు. నటి అమీ జాక్సన్ ఇందులో హీరోయిన్. 2010లో వచ్చిన రోబో చిత్రానికిది కొనసాగింపుగా వచ్చింది.