Asianet News TeluguAsianet News Telugu

'మహానటి' తరువాతే 'రంగస్థలం'!

దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన అధ్బుతం 'మహానటి'. అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

'Mahanati' ranked 4th and 'Rangasthalam' at 7th
Author
Hyderabad, First Published Dec 13, 2018, 1:58 PM IST

దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన అధ్బుతం 'మహానటి'. అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డ్ ని దక్కించుకుంది.

2018 లో ఇండియాలో విడుదలైన టాప్ 10 చిత్రాల్లో 4వ స్థానం దక్కించుకుంది. ఈ సినిమా తరువాత టాప్ 10లో మరో తెలుగు సినిమా 'రంగస్థలం' 7వ స్థానం దక్కించుకుంది. రామ్ చరణ్ నటించిన ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేశారు.

ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios