యామి గౌతమ్ పై ట్రోలింగ్.. ధీటుగా బదులిచ్చిన బ్యూటీ!
హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యామి గౌతంను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది.
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ కూడా బాగా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామి గౌతం కూడా ట్రోలింగ్ కి గురైంది. కానీ ఆమె సైలెంట్ గా ఉండకుండా తనను ట్రోల్ చేసిన వారికి తగిన సమాధానం చెప్పుకొచ్చింది.
పూర్తి వివరాలలోకి వెళితే.. హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యామి గౌతంను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ యామి గౌతం స్థానికతను ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్ షోలో యామి తాను చండీగఢ్ అమ్మాయినని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.
అసభ్యకర వీడియోలు చూపిస్తూ.. సీరియల్ నటి కామెంట్స్!
హిమాచల్ ప్రభుత్వంయామిని తమ అంబాసిడర్ గా నియమించుకుందని.. కానీ ఆమె మాత్రం చండీగఢ్కు చెందిన వ్యక్తిని అని చెప్పుకుంటుందని విమర్శలు చేశాడు. ఈ విషయంపై స్పందించిన యామి గౌతం ధీటుగా బదులిచ్చింది.
తన జన్మభూమి హిమాచల్ అని, చండీగఢ్ లో పెరిగానని.. అలానే తన కర్మభూమి ముంబై అని చెప్పింది. తను మానసికంగా చాలా బలంగా ఉంటానని.. ఇలాంటి మాటలు తనపై ఎంతమాత్రం ప్రభావం చూపలేవని అంది. మీరేం బాధపడకండి.. అలానే ఒత్తిడికి లోనవ్వకండి అంటూ సదరు నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది. దీంతో అతడు సైలెంట్ అయిపోయాడు.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'బాలా' అనే సినిమాలో నటిస్తోంది. బట్టతల ఉన్న వ్యక్తి కష్టాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.