Asianet News TeluguAsianet News Telugu

మహేష్ టీవీ యాడ్స్, సినిమా క్యాన్సిల్.. కారణం నమ్రతయేనా..?

మహేష్ గతంలో కూడా చాలా యాడ్స్ చేశారు కానీ టీవీ సీరియల్స్ యాడ్స్ లో అతడిని చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు. సూపర్ స్టార్ రేంజ్ లో ఉండి ఇలా టీవీ సీరియల్స్ యాడ్స్ చేయడమేంటని మండిపడ్డారు. 

what exactly happened to mahesh babu film with vamsi paidipally
Author
Hyderabad, First Published Feb 28, 2020, 3:53 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన అన్ని విషయాలు అతడి భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటుంది. ముఖ్యంగా ఆర్ధిక లావాదేవీలన్నీ కూడా నమ్రతానే డీల్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు కొన్ని టీవీ యాడ్స్ చేశాడు. అవి చూసిన చాలా మంది విమర్శలు చేశారు. మహేష్ గతంలో కూడా చాలా యాడ్స్ చేశారు కానీ టీవీ సీరియల్స్ యాడ్స్ లో అతడిని చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు.

సూపర్ స్టార్ రేంజ్ లో ఉండి ఇలా టీవీ సీరియల్స్ యాడ్స్ చేయడమేంటని మండిపడ్డారు. అయితే దానికి కారణం నమ్రత అని తెలుస్తోంది. ఆమె బిజినెస్ మైండ్ కి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని మహేష్ తో టీవీ యాడ్స్ చేసేలా చేసింది. ఈ యాడ్ కోసం మహేష్ కి కోటిన్నర రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇది ఇలా ఉండగా.. మహేష్ తో చాలా కాలంగా ట్రావెల్ చేస్తూ వస్తోన్న వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా నమ్రత అని అంటున్నారు.

నమ్రత కారణంగా మహేష్ ఇమేజ్ కి డ్యామేజ్..?

మహేష్ తో 'మహర్షి' సినిమా చేసిన తరువాత అతడితో కలిసి ట్రావెల్ చేశాడు వంశీ. రెండు కుటుంబాలు బాగా కలిసి కనిపించాయి. పార్టీలు, ట్రిప్ లకు కలిసే వెళ్లారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సమయంలో మహేష్ బాబుని అతడి కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఇలా చాలానే ఉన్నాయి. రెండు కుటుంబాలు ఒక్కటే అన్నంతగా కలిసిపోయాయి.

అలాంటిది ఒక్కసారిగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీనికి కారణం కూడా ఆర్ధిక లావాదేవీలే అని అందులో నమ్రత హస్తం ఉందని సమాచారం. సాధారణంగా అగ్రహీరోలు గత చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే కాస్త ఎక్కువ తీసుకోవాలని భావిస్తారు. మహేష్, వంశీ సినిమాని నిర్మించాలనుకున్న దిల్ రాజు మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. 'మహర్షి'కి కానీ, 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి కానీ నిర్మాతలకు పెద్దగా లాభాలు వచ్చింది లేదు.

ఈ నేపధ్యంలో మహేష్ గత చిత్రానికి తీసుకున్నట్లు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ కావాలంటే అది వర్కవుట్ కాదని భావించిన దిల్ రాజు.. వంశీతో సినిమా ఖరారు అయినా రెమ్యునరేషన్ విషయంలో మహేష్,నమ్రతలతో బేరానికి దిగాడు. ఇది ఊహించని నమ్రత అసలు ప్రాజెక్ట్ ఉండకుండా చేసిందని టాక్. మహేష్ కి భారీ రెమ్యునరేషన్ ఎవరైతే ఇస్తారో వారితోనే సినిమా చేయించాలని డిసైడ్ అయిందట. ఈ విషయంలో మహేష్ కూడా నమ్రతని అడ్డుకున్నట్లు అనిపించడం లేదు. అయితే ఇంతకాలం మహేష్ ని నమ్ముకొని ప్రాజెక్ట్ ఉంటుందని భావించిన వంశీ పైడిపల్లి ఈ విషయంలో బాధ పడినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios