Asianet News TeluguAsianet News Telugu

కుర్ర హీరో సినిమా.. రూ.15 కోట్లలో అవుతుందా?

పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయింది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్ లో చేయడానికి దర్శకుడు చందు మొండేటి ఒప్పుకున్నట్లు సమాచారం.

Update on Karthikeya 2 Movie
Author
Hyderabad, First Published Nov 11, 2019, 2:12 PM IST

చాలా కాలంగా 'కార్తికేయ' సినిమాకి సీక్వెల్ రాబోతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరో నితిన్, దర్శకుడు చందు మొండేటి కలిసి 'కార్తికేయ 2'
సినిమా చేయాలనుకుంటున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా వెనక్కి వెళ్తూ వస్తోంది.

ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయింది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్ లో చేయడానికి దర్శకుడు చందు మొండేటి ఒప్పుకున్నట్లు సమాచారం.

అనసూయకు మరో భారీ చిత్రం ఆఫర్ ?

అయితే ఈ బడ్జెట్ లో సినిమా పూర్తవుతుందా..? అనేది సందేహంగా మారింది. దర్శకుడు తీసుకున్న స్క్రిప్ట్ కాస్త ఖర్చుతో కూడుకున్నది. దేశంలో పలు చోట్ల సినిమా షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుందట. గతంలో ఇదే ప్రాజెక్ట్ కి రూ.20 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. ఖర్చు ఎక్కువ అవుతుందనే ఏషియన్ సునీల్ లాంటి వాళ్లు వెనక్కి తగ్గారు.

అలాంటిది ఇప్పుడు రూ.15 కోట్లలో సినిమా పూర్తి చేయడానికి చందు మొండేటి ఒప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్వాలిటీ విషయంలో చందు మొండేటి క్వాలిటీ విషయంలో రాజీ పడరు. 'సవ్యసాచి' సినిమాకి ముప్పై కోట్లకు పైగా ఖర్చు చేశారు. పైగా 'కార్తికేయ 2' సినిమాకి సీజీ వర్క్ చాలానే ఉంటుందట.

ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో నిఖిల్ సినిమా మీద పదిహేను కోట్లు పెడితే వర్కవుట్ అవుతుందా అనేది కూడా అనుమానంగా మారింది. హిందీ డబ్బింగ్ మార్కెట్ కాస్త బాగుండి ఉంటే ఈ సందేహాలు రావు. కానీ ఇప్పుడు హిందీ మార్కెట్ కూడా అంతగా లేదు. థియేటర్ మార్కెట్ కూడా డల్ గా ఉంది. మరి బడ్జెట్ విషయంలో ఏం చేస్తారో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios