సెంటిమెంట్ గా... సీన్ లోకి కలర్స్ స్వాతి!
నిఖిల్ తో అనుపమకి ఇది తొలి చిత్రమే అయినా… చందు మొండేటి కాంబినేషన్ లో మాత్రం అనుపమకి ఇది రెండో సినిమా. ఇదివరకు `ప్రేమమ్` కోసం అనుపమ, చందు కలసి పనిచేశారు.
చాలా కాలం తర్వాత అర్జున్ సురవరం చిత్రంతో నిఖిల్ హిట్ జోన్ లోకి వచ్చాడు. దాంతో తనకు కార్తికేయ వంటి హిట్ ఇచ్చిన చందు మొండేటితో తన తదుపరి సినిమా మొదలెట్టాడు. సేఫ్ జోన్ లో ఉండటం కోసం కార్తికేయకే సీక్వెల్ కథ రెడీ చేసి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేందుకు కలర్స్ స్వాతిని ఒప్పించి ప్రాజెక్టులోకి తెచ్చినట్లు సమాచారం. కార్తికేయలో ఆమె నటించటంతో ఈ సీక్వెల్ లో ఆమె ఉంటే బాగుంటుందని దర్శకుడు, నిఖిల్ భావించినట్లు సమాచారం. అయితే ఆమె హీరోయిన్ గా కనిపించదు.
మరి ఏ పాత్రలో కలర్స్ స్వాతి కనిపిస్తుంది అంటే టీవి రిపోర్టర్ స్వాతిగా ఈ సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. `కార్తికేయ` కథ ఎక్కడ ముగిసిందో… అక్కడి నుంచే `కార్తికేయ 2` ప్రారంభం అవుతుందట.
పెళ్లి చేసుకుంటానని డబ్బు తీసుకొని.. నటిపై ఆరోపణలు!
కుంభమేళా నేపథ్యంలో…. `కార్తికేయ` సీక్వెల్ తెరకెక్కుతోందని సమాచారం. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో హీరోయిన్ గా `ప్రేమమ్` బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. ఇదివరకు శ్రుతి శర్మ, నభా నటేష్ పేర్లు వినిపించినా ఆ అవకాశం అనుపమకి దక్కిందని చెప్తున్నారు. త్వరలోనే అనుపమ ఖరారుపై క్లారిటీ వస్తుంది.
నిఖిల్ తో అనుపమకి ఇది తొలి చిత్రమే అయినా… చందు మొండేటి కాంబినేషన్ లో మాత్రం అనుపమకి ఇది రెండో సినిమా. ఇదివరకు `ప్రేమమ్` కోసం అనుపమ, చందు కలసి పనిచేశారు. మరి… హిట్ వచ్చిన హీరో,హీరోయిన్స్ తో చందు మొండేటి చేస్తున్న ఈ ప్రయత్నానికి 15 కోట్లు దాకా ఖర్చు పెడుతున్నారు.
జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సీక్వెల్ ని నిర్మించనుంది.శరవేగంగా షూటింగ్ జరిపి 2020 ఆగస్ట్ లో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఐదేళ్ళ తరువాత తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి..