Asianet News TeluguAsianet News Telugu

వైరల్ న్యూస్ పై మహేష్, బన్నీ ఫ్యాన్స్ రచ్చ!

గత కొన్నిరోజులుగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. 

Social media war: Mahesh babu Fans Vs Allu Arjun Fans
Author
Hyderabad, First Published Dec 26, 2019, 1:01 PM IST

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయం బాగా వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్ వార్స్ గురించి చెప్పనక్కర్లేదు. అప్పటివరకు కోలీవుడ్ లో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ జరిగేవి. అది మెల్లమెల్లగా టాలీవుడ్ కి కూడా పాకింది.

ఇక్కడ ఫ్యాన్స్ అంత తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్ప అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. గత కొన్నిరోజులుగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ఒకే సమయానికి ప్రేక్షకుల ముందుకు రావలనుకున్నాయి.

లేడీ 'ఎమ్మెల్యే' ఘాటు అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే!

సినిమా ప్రమోషన్స్ కూడా అలానే పోటీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దలు కల్పించుకొని రిలీజ్ డేట్లు మార్చుకునేలా చేశారు. దీంతో అల్లు అర్జున్ కంటే మహేష్ ఒకరోజు ముందుగా థియేటర్ లోకి రానున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఈ రెండు సినిమాలకు సంబంధించిన విడుదల చేసిన టీజర్లు, పాటలు ఇలా ప్రతీదీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూసుకున్నారు.

మహేష్ కి సంబంధించి ఏదైనా నెగెటివ్ కనిపిస్తే.. దాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ హైలైట్ చేయడం, అలానే బన్నీకి సంబంధించిన ఏదైనా నెగెటివ్ ఎలిమెంట్ బయటకొస్తే దాన్ని మహేష్ ఫ్యాన్స్ హైలైట్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ చాలా రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా మహేష్ బాబు తన అభిమానులతో ఫోటోలు దిగడానికి ఓ ఈవెంట్ లో పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు సరిగ్గా నిర్వహించకపోవడంతో తొక్కిసలాట జరగడం, కొందరు అభిమానులకు దెబ్బలు తగలడం వంటివి చోటుచేసుకున్నాయి. బౌన్సర్లు తమను ఇష్టమొచ్చినట్లుగా కొట్టారంటూ మహేష్ అభిమానులు స్వయంగా చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. మరికొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో మహేష్ ని కలవడం కోసం డబ్బులు చెల్లించి పాస్ లు కొనుగోలు చేసిన విషయాన్ని బయటపెట్టడంతో ఇది కాస్త వైరల్ అయింది.

దీంతో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. మహేష్ నేరుగా డబ్బులు తీసుకున్నా.. లేకపోయినా.. నిర్వాహకులు మాత్రం డబ్బులు వసూలు చేశారనేది నిజమంటూ చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మహేష్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి!

 

Follow Us:
Download App:
  • android
  • ios