'దర్బార్' దుమారం.. ఆ డైలాగ్ శశికళను ఉద్దేశించేనా..?
ఈ సినిమాలో ఓ డైలాగ్ శశికళని కించపరిచినట్లుగా ఉందని.. ఆ సంభాషణ తొలగించాలని ఆమె తరఫున న్యాయవాది డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించిన సంగతి తెలిసిందే
సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'దర్బార్'. జనవరి 9న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా పాజిటివ్ బజ్ రావడంతో తలైవా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ శశికళని కించపరిచినట్లుగా ఉందని.. ఆ సంభాషణ తొలగించాలని ఆమె తరఫున న్యాయవాది డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించిన సంగతి తెలిసిందే.
గ్లామర్ డోస్ పెంచిన శ్రీ ముఖి (ఫొటోస్)
సినిమాలో ఓ సన్నివేశంలో జైలులో ఖైదీ సెల్ ఫోన్ లో మాట్లాడుతూంటాడు. అప్పుడు డబ్బులుంటే ఖైదీలు షాపింగ్ కి కూడా వెళ్లొచ్చన్న డైలాగ్ వస్తుంది. ఆ సన్నివేశంలో ఎక్కడా కూడా శశికళ పేరు వినిపించలేదు. కానీ అది శశికళని ఉద్దేశించినట్లుగా ఉందని.. కావాలనే డైలాగ్ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో సినిమా నుండి ఆ డైలాగ్ ని తొలగించాలని శశికళ తరఫు న్యాయవాది నుండి డిమాండ్ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. లేకపోతే చట్టపర చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్ కీలకపాత్ర పోషించింది. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.