‘పింక్’ రీమేక్: పవన్ తెలివిగా పొలిటికల్ చెక్?
ఈ మేరకు వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి, ఆలోచనలకు తగినట్లుగా పింక్ సినిమా స్క్రిప్ట్ని మార్పులు చేర్పులతో స్క్రిప్టుని లాక్ చేసుకున్నాడట. ఈ నేపధ్యంలో పింక్ రీమేక్లో పవన్ కళ్యాణ్ని పూర్తిగా హైలెట్ చెయ్యడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరుని చూపెట్టబోతున్నట్లు చెప్తున్నారు.
పవన్ ప్రధాన పాత్రలో ‘పింక్’ తెలుగు రీమేక్ తెరకెక్కుతోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇక సినిమాలు చేయను, పూర్తిగా రాజకీయాల్లోనే అన్న పవన్..మనస్సు మార్చుకుని ఈ చిత్రం ఒప్పుకోవటం వెనక ఓ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లు కేవలం దిల్ రాజు ఇచ్చే రెమ్యునేషన్ కోసం ఈ సినిమా ఒప్పుకోలేదు అంటున్నారు.
చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారన చెప్తున్నారు. అదేమిటంటే.. పవన్ ఈ సినిమా ద్వారా మహిళలకు రక్షణ, దిశ చట్టం, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మహిళా అత్యాచారాలపై మాట్లాడాలనే ఆలోచనతోనే అంటున్నారు. సినిమా అనేది పవర్ ఫుల్ మాధ్యమం కావటంతో మహిళా సమస్యల గురించి చర్చించటానికి ఇదే సరైన వేదిక అని ఆయన భావించారట. అంతేకాదు పనిలో పనిగా కొన్ని పొలిటికల్ సెటైర్స్ కూడా ఉండబోతున్నాయట.
ఈ మేరకు వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి, ఆలోచనలకు తగినట్లుగా పింక్ సినిమా స్క్రిప్ట్ని మార్పులు చేర్పులతో స్క్రిప్టుని లాక్ చేసుకున్నాడట. ఈ నేపధ్యంలో పింక్ రీమేక్లో పవన్ కళ్యాణ్ని పూర్తిగా హైలెట్ చెయ్యడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరుని చూపెట్టబోతున్నట్లు చెప్తున్నారు. సినిమాలో లాయర్ పాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ వేసే పొలిటికల్ సెటైర్స్ ఓ రేంజ్ లో పేలబోతున్నాయని చెప్తున్నారు.
షాకింగ్: విజయ్ దేవరకొండకి రూ.48 కోట్ల ఆఫర్!
అయితే దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్ లో వచ్చే సినిమాలో అలాంటి సైటైర్స్ పెడతారా..కోరి కోరి ప్రభుత్వాలతో దెబ్బలాట పెట్టుకుంటారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏదైమైనా పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం పింక్ రీమేక్ని వాడుకోబోతున్నాడనేది మాత్రం ఓ వర్గానికి ఆనందం కలిగించే వార్తే.
ఇక పవన్ ఈ చిత్రం కోసం కేవలం 21 రోజులు మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. ఇరవై ఒక్క రోజుల్లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోమని దర్శక, నిర్మాతలకు చెప్పినట్లు వినపడుతోంది. ఈ మేరకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక్క రోజు కూడా వేస్ట్ కాకూడదని ఖచ్చితంగా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా ఈ మూవీ రాబోతుంది.దాంతో పింక్ రీమేక్ షూటింగ్, కాస్టింగ్ విషయమై దర్శక,నిర్మాతలు క్లారిటీతో ఏ కన్ఫూజన్ లేకుండా ఫిక్సై ఉన్నట్లు సమాచారం. అలాగే సినిమా రిలీజ్ కూడా వేసవిలో అంటే మే నెల చివరి వారంలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
బాలీవుడ్, కోలీవుడ్లో మంచి హిట్ అయిన చిత్రం ‘పింక్’. మహిళల రక్షణ చుట్టూ సాగే ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీ కీలకపాత్రలుగా తెరకెక్కింది. ‘పింక్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించనున్నట్లు నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. `లాయర్ సాబ్` అనే టైటిల్ని పరిశీలుస్తున్న ఈ రీమేక్లో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నివేదా చేయనున్నారంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర బేనర్పై రూపొందుతున్న 40వ సినిమా ఇది. అద్భుతమైన ట్యూన్తో పింక్ చిత్ర పనులు మొదలు అయ్యాయి అని నిర్మాణ సంస్థ తన ప్రకటనలో తెలిపింది.