Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పక్కన రష్మిక.. జాక్‌పాట్‌ కొట్టినట్లే..!

 ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ తో కలిసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న'భీష్మ' సినిమాలో నటిస్తోంది. 

Rashmika Mandanna to romance NTR
Author
Hyderabad, First Published Jan 27, 2020, 1:59 PM IST

కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో స్టార్ గా ఎదిగిన నటి రష్మిక మందన.. ఆ తరువాత తెలుగులో 'ఛలో' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక 'గీత గోవిందం' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఈ సినిమా తరువాత రష్మికకి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ తో కలిసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న'భీష్మ' సినిమాలో నటిస్తోంది.

రష్మిక వీడియో చూశారా.. నిమిషం పాటు ఆపకుండా..

ఈ సినిమా తరువాత రష్మిక.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జత కట్టబోతుందని సమాచారం. ప్రస్తుతం 'RRR' సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.

ఎన్టీఆర్-రష్మికల కాంబో వెండితెరకి ఫ్రెష్ నెస్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, రష్మిక మరో జాక్‌పాట్‌ కొట్టినట్లే. తన సినిమాల్లో త్రివిక్రమ్ హీరోయిన్లకు పెద్ద పీట వేస్తుంటాడు.

ఈ సినిమాలో కూడా రష్మిక క్యారెక్టర్ క్లిక్ అయితే ఆమె కెరీర్ కి తిరుగుండదు. ప్రస్తుతం రష్మిక.. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios