రజనీ వచ్చి రచ్చ చేస్తే కానీ.. బిజినెస్ అయ్యేటట్లు లేదు!
‘పేట’ తర్వాత రజనీ నటించిన సినిమా ‘దర్బార్’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, తేదీ ఖరారైంది. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
రజనీకాంత్ తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే ఈ మద్యకాలంలో ఆయన నటించిన సినిమా ఏదీ సరిగ్గా ఆడకపోవటంతో ఆ మార్కెట్ మట్టిలో కలిసిపోయినట్లైంది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ తాజా చిత్రం ‘దర్బార్’ తెలుగులోనూ భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు. దాంతో బిజినెస్ లో కూడా కదిలిక లేదని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో కబాలి స్దాయిలో ఈ సినిమాకు బజ్ తీసుకు వచ్చి ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దాంతో ప్రమోషన్స్ డోసు పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. రజనీ హాజరయ్యే ఈ ఈవెంట్ కు తెలుగు నుంచి ఆయన స్నేహితులు హాజరయ్యే అవకాసం ఉంది.
ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ 'RRR'.. కీరవాణి తనయుడు కామెంట్స్!
‘పేట’ తర్వాత రజనీ నటించిన సినిమా ‘దర్బార్’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, తేదీ ఖరారైంది. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేసింది. శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ను నిర్వహిస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. రజనీ స్టైలిష్ పోలీసు అధికారిగా కనిపించి, ఆకట్టుకున్నారు.
ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్తో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.