Asianet News TeluguAsianet News Telugu

రెండు పార్ట్ లుగా నితిన్ చిత్రం.. మహానటితో మరోసారి.. ప్లాన్ అదుర్స్

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన భీష్మ మూవీ మంచి విజయం సాధించింది.

Nithiin and keerthy suresh join hands for second time
Author
Hyderabad, First Published May 5, 2020, 3:30 PM IST

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన భీష్మ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా 'మహానటి' కీర్తి సురేష్ నటిస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మరింత జోరుగా ముందుకు సాగనుంది. తాజా సమాచారం మేరకు నితిన్, కీర్తి సురేష్ జోడి మరోసారి రిపీట్ కానున్నట్లు టాక్. 

రంగ్ దే చిత్రం తర్వాత నితిన్ అంధాదున్, చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో చెక్ అనే మూవీలో నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే నితిన్ కృష్ణ చైతన్య దర్శత్వంలో పవర్ పేట అనే చిత్రంలో నటించాల్సి ఉంది. 

పవన్, త్రివిక్రమ్ 'జల్సా' వివాదం.. పూనమ్ కౌర్ ఎన్నాళ్లకు క్లారిటీ ఇచ్చింది..

యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ అని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios