Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ రాజకీయం చేసింది.. 'ఏడు చేపల కథ' నటి ఫైర్!

అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఏడుచేపల కథ చిత్రం ఇటీవల విడుదలయింది. ఇది ఒక చెత్త సినిమా అని ఫిలిం క్రిటిక్స్ అంతా తేల్చేశారు. కానీ ట్రైలర్ తో ఈ చిత్రంపై నెలకొన్న హైప్ వల్ల ఏడు చేపల కథ చిత్రానికి వసూళ్లు బాగానే వస్తున్నాయి.

Meghana Chowdary Fires On Yedu Chepala Katha Team
Author
Hyderabad, First Published Nov 14, 2019, 3:44 PM IST

అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఏడుచేపల కథ చిత్రం ఇటీవల విడుదలయింది. ఇది ఒక చెత్త సినిమా అని ఫిలిం క్రిటిక్స్ అంతా తేల్చేశారు. కానీ ట్రైలర్ తో ఈ చిత్రంపై నెలకొన్న హైప్ వల్ల ఏడు చేపల కథ చిత్రానికి వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్, ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులని ఆకర్షించింది. 

బిగ్ బాస్2 ఫేమ్ భానుశ్రీ, మేఘన చౌదరి ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విషయంలో తనకు అన్యాయం జరిగిందని మేఘన చౌదరి అంటోంది. ఈ చిత్ర ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మేఘన చౌదరి నటించిన సన్నివేశాలని హైలైట్ చేశారు. కేవలం నా వల్లనే ఈ చిత్రానికి ఇంత హైప్ వచ్చింది. 

'ఏడు చేపల కథ' సినిమాకి కలెక్షన్ల మోత!

చాలా మంది ప్రేక్షకులు ట్రైలర్ చూసే ఈ చిత్రానికి వచ్చారు. కానీ సినిమాలో మాత్రం నా పాత్రని బాగా తగ్గించేశారు. చిత్ర యూనిట్ అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదు. ట్రైలర్ లో నా పాత్ర చూసే ఆడియన్స్ సినిమాకు వచ్చారు. వారు కోరుకున్న పాత్ర సినిమాలో లేకుంటే డిసప్పాయింట్ కారా అని మేఘన చౌదరి ప్రశ్నించింది. 

నా స్నేహితులు, ఫ్రెండ్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ సినిమా బిజినెస్ జరిగిందే నీవల్ల.. అలాంటి నీ సీన్స్ లేకపోవడం ఏంటి అని అంటున్నారు. కనీసం బుక్ మై షో లో కూడా నా పేరు వేయలేదని మేఘన చౌదరి ఆవేదన వ్యక్తం చేసింది. దీని వెనుక చాలా రాజకీయం జరిగిందని మేఘన తెలిపింది. 

ట్రైలర్ రిలీజ్ కాగానే నేను సినిమా ప్రమోషన్ మొదలు పెట్టా. నేనెక్కడ హైలైట్ అయిపోతానో అని బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ రాజకీయం చేసింది. చిత్ర యూనిట్ కి చెప్పి నా ప్రమోషన్స్ ఆపించేసింది. వాళ్ళ అలా ఎందుకు చేశారు ఇప్పుడు సినిమా విడుదలయ్యాక అర్థం అయింది అని మేఘన బి భానుశ్రీపై మండిపడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios