Asianet News TeluguAsianet News Telugu

నితిన్ కోసం వస్తున్న మెగా హీరో.. క్రేజీ న్యూస్!

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి షో నుంచే భీష్మ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది.

Mega hero will grace the bheeshma thanks meet
Author
Hyderabad, First Published Feb 27, 2020, 4:10 PM IST

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి షో నుంచే భీష్మ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. దీనితో వారం పూర్తి కాకముందే భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. 

వెంకీ కుడుముల దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, రష్మిక జంటగా నటించారు. మంచి హాస్యభరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. రష్మిక గ్లామర్ తో ఆకట్టుకోగా.. నితిన్, వెన్నెల కిషోర్ కామెడీ  టైమింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఇక విడుదల తర్వాత కూడా భీష్మ చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. శనివారం ఫిబ్రవరి 29న వైజాగ్ లో భీష్మ చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ ఈవెంట్ సంబంధించిన క్రేజీ న్యూస్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

మూడు రెట్లు నష్టపరిహారం.. త్రివిక్రమ్ కు చుక్కలు చూపిస్తున్న 'మైత్రి' ?

భీష్మ థాంక్స్ మీట్ కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలిపారు. దీనితో అటు నితిన్ ఫ్యాన్స్ కు, వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కు భీష్మ థాంక్స్ మీట్ కనుల పండుగ కాబోతోంది. వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే తన తదుపరి చిత్ర షూటింగ్ లో ఉన్నాడు. దీనితో భీష్మ చిత్ర యూనిట్ వరుణ్ ని ఈ ఈవెంట్ కు ఇన్వైట్ చేసింది. 

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సీనియర్ నటుడు అనంత్ నాగ్, సంపత్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios