‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతారా: చాప్టర్ 1’ 2025 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కదంబ రాజుల కాలం నాటి కథను సినిమాగా తెరకెక్కించారు. 

 కన్నడలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతారా: చాప్టర్ 1’ 2025 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
"కాంతారా చాప్టర్ 1" రిలీజ్ డేట్ అక్టోబర్ 2, 2025 అని హొంబాళె ఫిలిమ్స్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇటీవల ఈ తేదీ గురించి కొన్ని ఊహాగానాలు వ్యాపించాయి. ఈ గందరగోళానికి తెరదించుతూ హొంబాళె ఫిలిమ్స్ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని అధికారికంగా స్పష్టం చేసింది. 

ప్రణాళిక ప్రకారం అన్నీ సజావుగా సాగుతున్నాయి. గతంలో వచ్చిన కాంతార" సినిమా  సక్సెస్ తరువాత కాంతార చాప్టర్ 1" ప్రేక్షకులను మరింత లోతుకిి తీసుకెళ్ళి.. చరిత్రను  వివరంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా  కథ సంస్కృతి, దైవత్వం లోకి తీసుకెళ్తుంది. మీ ఆసక్తికి తగ్గట్టుగా సినిమా అనుకున్న తేదీనే రిలీజ్ అవుతుందని హొంబాళె ఫిలిమ్స్ తెలిపింది. అందువల్ల అనధికారిక వార్తలను నమ్మకుండా అధికారిక ప్రకటనలనే నమ్మాలని మూవీ టీమ్ కోరింది.

రిషబ్ శెట్టి కథ రాసి, దర్శకత్వం వహించి, హీరోగా నటిస్తున్న ఈ సినిమాను  విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కాంతార ప్రీక్వెల్ కదంబ రాజుల కాలంలో జరుగుతుంది. రిషబ్ శెట్టి నాగ సాధువుగా అతీంద్రియ శక్తులున్న పాత్రలో మెప్పించనున్నారు.

నవంబర్ 2023లో ఈసినిమా  షూటింగ్ మొదలైంది. కుందాపురంలో కదంబ సామ్రాజ్యం సెట్ లో చిత్రీకరణ జరిగింది. రిషబ్ శెట్టి కళరిపయట్టు, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోకనాథ్ సంగీతం, ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ ఈ సినిమాకు అందాన్ని తెచ్చాయి. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

కాంతార సూపర్ డూపర్ హిట్!

‘కాంతార’ సినిమా సెప్టెంబర్ 30, 2022న కర్ణాటకలో 250కి పైగా థియేటర్లలో విడుదలైంది. కేరళలో షూటింగ్ జరిగింది. కంబాల, భూత కోల సంప్రదాయాలను ఈ సినిమాలో  అద్భుతంగా చూపించారు. ఈ సినిమా మనిషి, ప్రకృతి మధ్య సంఘర్షణను చూపించే ఓ పురాణ కథ. రిషబ్ శెట్టి కంబాల ఛాంపియన్ శివుడిగా, కిశోర్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళిగా నటించారు. సప్తమి గౌడ హీరోయిన్. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోకనాథ్ సంగీతం, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి వారంలోనే 38-50 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో డబ్ అయ్యి విడుదలైంది. కాంతార కర్ణాటక సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఓ మాస్టర్ పీస్.