Asianet News TeluguAsianet News Telugu

రూ.5 కోట్లు ఎగవేత.. నటుడు ప్రకాష్ రాజ్ పై కేసు!

తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను సొంత దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాష్ రాజ్ 'నడిగర్' అనే సినిమాని నిర్మించారు. 

High Court Gave Notices To Actor Prakash Raj For Nadigar Film
Author
Hyderabad, First Published Feb 28, 2020, 11:42 AM IST

నటుడు ప్రకాష్ రాజ్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేశారు.

తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను సొంత దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాష్ రాజ్ 'నడిగర్' అనే సినిమాని నిర్మించారు. ఇది తమిళంలో రూపొందించిన 'ఉన్ సమయల్ అరైయిల్' సినిమాకి రీమేక్'.

ఎమోషనల్ గా వాడుకున్నాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై రష్మీ కామెంట్స్

అయితే ఈ సినిమాకి ఆయన బాలీవుడ్ ఫైనాన్షియర్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ ఆ ఫైనాన్షియర్ కి చెక్కుని ఇవ్వగా.. అది బ్యాంక్ లో బౌన్స్ అయింది.

దీంతో ఆ ఫైనాన్షియర్ నటుడు ప్రకాష్ రాజ్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను గురువారం నాడు విచారించిన న్యాయమూర్తి ఏప్రిల్ 2వ తేదీలోగా కోర్టుకి హాజరవ్వాలని నటుడు ప్రకాష్ రాజ్ కి సమన్లు జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios