Asianet News TeluguAsianet News Telugu

పవన్ రేంజ్ రూ.70లక్షలేనా..? షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావసభలో ... జనసేన పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. సమాజంలో పిరికితనం ఎక్కువైపోయిందని, ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి అనుక్షణం కృషి చేస్తానని అన్నారు. 

Do You Know what were the budget estimates producers had before his foray into cinema?
Author
Rajahmundry, First Published Mar 14, 2020, 3:15 PM IST

జనసేన పార్టీ 6వ ఆవిర్భావసభ నేడు రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన ముఖ్యనాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావసభలో ... జనసేన పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. సమాజంలో పిరికితనం ఎక్కువైపోయిందని, ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి అనుక్షణం కృషి చేస్తానని అన్నారు. 

ఈ సందర్భంగా తన నిజ జీవిత గాథ ఒకటి అక్కడ ఉన్న వారందరికీ వివరించారు. ఏ మనిషిని తక్కువ అంచనా వేయకూడదని చెబుతూ ఈ ఉదాహరణను ఇచ్చారు. తాను సినిమాల్లోకి రాకముందు తన సినిమా మీద ఎంత ఖర్చుపెట్టొచ్చు అంటే... 70 లేదా 80 లక్షలు, ఇంకా ఎక్కువంటే కోటి రూపాయలు మాత్రమే ఇతని రేంజ్ అని అన్నారట. 

Also read: జాకెట్లలో దాచుకున్నా లాక్కుంటున్నారు: స్థానిక ఎన్నికల తీరుపై బాబు వ్యాఖ్యలు

అలా ఆరోజు ఆ మనుషులు అన్న మాటలను పట్టుకొని ప్రభావితమై ఉంటే... ఈ రోజున ఈ స్థాయిలో ఇంత మంది అభిమానులను పొందగలిగే వాడిని కాదని అన్నాడు. అందుకోసమే తాను ఏవారిని కూడా మీ రేంజ్ ఇది అని డిసైడ్ చేయను అని అన్నారు. 

ఇక ఈ సభలో ఆయన అధికార వైసీపీ ఆగడాల గురించి పదే పదే చెప్పారు. రాజకీయాలు క్రిమినల్స్ తో నిండిపోయాయని ఇలాంటి వారినే ప్రజలు కూడా ఎన్నుకున్నారని ఆయన అన్నారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే... తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  

ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..ఉమెన్స్ డే సంధర్భంగా ఈ చిత్రం నుండి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం కథ ప్రకారం పవన్ భార్య పాత్ర కోసం ఓ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

Also read: రౌడీలు కాబట్టి కాల్చేశారు: దిశ రేప్, హత్య కేసుపై పవన్ కల్యాణ్

ఈ సినిమాలో వచ్చే  కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్య తో ఉండే ఎపిసోడ్ ఒకటుంది.  ఆ ఎపిసోడ్ లో ...తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే పాత్రను శృతి హాసన్ చేయబోతున్నట్టు హాట్ అప్ డేట్.  ఇప్పటికే ఈ విషయంపై ఆమెని సంప్రదించటం, ఒప్పుకోవడం జరిగిందని సమచారం. కథ ప్రకారం ఈ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. అయినా గుర్తుండిపోయే పాత్ర కావటంతో శృతి సరేనందిట.  

గతంలో వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ హిట్ . ఆ చిత్రం తర్వాత శృతి హాసన్  టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరసగా రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన వరస సినిమాలు చేసింది. ఇప్పుడు రవితేజ క్రాక్ తో ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శృతి హసన్ కు వకీల్ సాబ్ ఆఫర్ అంటే మంచి ఆఫర్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తనకు పవన్ కు,శృతితో ఒక డీసెంట్ ఎమోషనల్ సాంగ్ ఉంటుందట. అలాగే కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది, కాని ఆమె పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios