Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మానందంకి ఛాలెంజ్ విసిరిన బిత్తిరిసత్తి

జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది  

bitthiri satthi challenge to actor brahmanandham for green india
Author
Hyderabad, First Published Nov 21, 2019, 8:38 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా బిత్తిరి సత్తి గారు మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మరొక నలుగురిని   మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.1) హాస్య నటుడు బ్రహ్మానందం 2) కల్వకుంట్ల హిమాన్సు రావు 3) ప్రియా దర్శిని 4) తీన్ మార్ శివ జ్యోతి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

read also: గ్రీన్ ఇండియా చాలెంజ్ ని స్వీకరించిన యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ ఇటివల తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సీనిమా యాక్టర్ బిగ్ బాస్ సామ్రాట్ తన స్నేహితుడు గుడి వంశీధర్ రెడ్డి విసిరిన చాలెంజ్ ని స్వీకరించి బుధవారం మొక్కను నాటారు      తదనంతరం తాను ముగ్గురు సినిమా యాక్టర్స్ వరుణ్ సందేశ్, యాంకర్ శ్యామల, హీరో నిఖిల్ కి చాలెంజ్ విసిరారు.   గత కొద్ది రోజులుగా యంపి సంతోష్ కూమార్ చేపట్టిన  ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి చలన చిత్ర రంగంలో మంచి ఆదరణ లభించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios