యాంకర్ శ్రీముఖి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం శ్రీముఖి పలు టివి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి ఎనేర్జిని మ్యాచ్ చేయడం కష్టం.
ఇటీవల శ్రీముఖి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో చిన్నపాటి కలకలమే సృష్టించింది. సరదాకు తాను ప్రెగ్నెంట్ అని అంటూ శ్రీముఖి చేసిన కామెంట్స్ కు సుమతో సహా అక్కడున్న వారంతా షాకయ్యారు.
'చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు'.. వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్
ఎలాంటి సంధర్భంలో స్వీట్లు పంచుతారు అనే ప్రశ్నకు బదులిస్తూ శ్రీముఖి ఈ వ్యాఖ్యలు చేసింది. శ్రీముఖి కామెంట్స్ తో సుమకు కాసేపు ఏమ్మాట్లాడాలో అర్థం కాలేదు.
ఈ వ్యాఖ్యలపై షో తర్వాత సుమ.. శ్రీముఖికి చిన్నపాటి క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. పబ్లిసిటీ కోసం సరదాకి కూడా కొన్ని రకాల కామెంట్స్ చేయకూడదని శ్రీముఖికి సుమ చెప్పిందట.
