Asianet News TeluguAsianet News Telugu

నలుగురు పిల్లలకు విషం ఇచ్చి... తల్లి ఆత్మహత్య

ఈ ఘటనలో తల్లి మృత్యువాతపడగా.... చిన్నారులు మాత్రం కొనఊపిరితో  కొట్టుకుంటున్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

woman commits suicide after gave poison to her children
Author
Hyderabad, First Published Sep 23, 2019, 12:17 PM IST

కర్నూలు జిల్లా డోన్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలకు విషం ఇచ్చి... తల్లికూడా విషం తీసుకుంది. కాగా ఈ ఘటనలో తల్లి మృత్యువాతపడగా.... చిన్నారులు మాత్రం కొనఊపిరితో  కొట్టుకుంటున్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తల్లి చనిపోయిందని.... చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే  ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios