ఈ ఘటనలో తల్లి మృత్యువాతపడగా.... చిన్నారులు మాత్రం కొనఊపిరితో  కొట్టుకుంటున్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కర్నూలు జిల్లా డోన్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలకు విషం ఇచ్చి... తల్లికూడా విషం తీసుకుంది. కాగా ఈ ఘటనలో తల్లి మృత్యువాతపడగా.... చిన్నారులు మాత్రం కొనఊపిరితో కొట్టుకుంటున్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తల్లి చనిపోయిందని.... చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.