Asianet News TeluguAsianet News Telugu

RTC strike: గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్..పరిస్థితి విషమం

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఇప్పటికే పలువురు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాలలో మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుకు లోనయ్యాడు. సమ్మెలో భాగంగా సోమవారం మంచిర్యాల బస్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబసభ్యులు బైఠాయించి దీక్షకు దిగారు. 

rtc strike: bus driver suffers from heart attack at mancherial depot
Author
Manchiryal, First Published Oct 21, 2019, 2:58 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఇప్పటికే పలువురు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాలలో మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుకు లోనయ్యాడు. సమ్మెలో భాగంగా సోమవారం మంచిర్యాల బస్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబసభ్యులు బైఠాయించి దీక్షకు దిగారు.

బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాలు వారి దీక్షకు మద్ధతు పలికాయి. ఈ సమయంలో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ నాయకులతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

tsrtc strike: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఆ తోపులాటలో ఆర్టీసీ డ్రైవర్‌ వీఎస్ఎన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన అక్కడిక్కడే కుప్పుకూలారు. తోటి కార్మికులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

గత 15 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆయన పాల్గొన్నారని, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే ఆవేదనతో ఆయన చనిపోయారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల తెలంగాణ ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

కొద్దిరోజుల క్రితం ఉద్యోగం లేక సొంతింటికి చేసిన అప్పు తీరుతుందో లేదోననే మనస్తాపంతో హైదరాబాద్ 49M రూట్ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ గౌడ్ హైదరాబాద్ రాణి గంజ్ ఆర్టీసీ డిపో టూ లో పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహాన్ని కార్వాన్ లోని ఇంట్లో  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రాంచందర్ రావు లు సందర్శించారు. 

ప్రగతి భవన్ ముట్టడి: పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించిన రేవంత్, జగ్గారెడ్డి

సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ అనే కండక్టర్ బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘‘చలో ప్రగతి భవన్’’ ఉద్రిక్తంగా మారింది. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, విక్రమ్ గౌడ్, రాములు నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఆదివారం సాయంత్రం నుంచే జిల్లాల్లో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios