Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్, కివీస్ ల మద్య ఫైనల్... టీమిండియానే కారణం: మైఖేల్ వాన్

ప్రపంచ కప్  2019 ఫైనల్లో తలపడే జట్లేవో తేలిపోయింది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే ఫైనల్ కు చేరిన ఈ రెండు జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీ మొత్తంలో భారత్ ను ఓడించగలిగాయి. ఇలా భారత జట్టు జోరును అడ్డుకున్న జట్లే ఫైనల్ కు చేరతాయన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ముందుగానే చెప్పిన మాట నిజమయ్యింది. 

world cup 2019: Who ever beats India will win World Cup 2019: Michael Vaughan
Author
Manchester, First Published Jul 12, 2019, 5:29 PM IST

ప్రపంచ కప్  2019 ఫైనల్లో తలపడే జట్లేవో తేలిపోయింది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే ఫైనల్ కు చేరిన ఈ రెండు జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీ మొత్తంలో భారత్ ను ఓడించగలిగాయి. ఇలా భారత జట్టు జోరును అడ్డుకున్న జట్లే ఫైనల్ కు చేరతాయన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ముందుగానే చెప్పిన మాట నిజమయ్యింది. 

ఇదే విషయాన్ని వాన్ మరోసారి గుర్తుచేస్తూ ఓ ట్వీట్ చేశారు. '' నేను ఎప్పుడో చెప్పా టీమిండియాను ఓడించి జట్టే ఈ ప్రపంచ కప్ లో గెలుస్తుందని'' అంటూ గతంలో తాను చెప్పిన మాటలను గుర్తుచేశాడు. 

గతంలో టీమిండియా లీగ్ దశలో దూసుకుపోతున్న సమయంలో వాన్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు టీమిండియా జోరును అడ్డుకున్న జట్టే ఈ ప్రపంచ కప్ విజేతగా నిలుస్తుందని కామెంట్ చేశాడు. అతడు చెప్పినట్లే లీగ్ దశలో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. మొత్తం ఎనిమిది మ్యాచుల్లో ఏడు విజయాలను అందుకున్న భారత్ ను కేవలం ఆతిథ్య జట్టు మాత్రమే ఓడించగలిగింది. 

ఇక ఆ తర్వాత మళ్లీ మాంచెస్టర్ వేదికన జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆట ముగిసింది. అయితే ఆ వరల్డ్ కప్ లో భారత్ కేవలం ఇంగ్లాండ్, కివీస్ చేతుల్లోనే ఓడిపోగా ఆ రెండు జట్లే ఫైనల్ కు చేరాయి. వాటిల్లో ఏదో ఒక జట్టు 2019 ప్రపంచ కప్ ట్రోఫీనే కాదు మొదటిసారి విశ్వవిజేతగా నిలవనుంది. ఇలా మైఖేల్ వాన్ ఊహించినట్లే టీమిండియాను ఓడించిన జట్టే ప్రపంచ కప్ విజేత కానుంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios