పాక్కు తొలి మూడు మ్యాచ్లు 1992లాగే: కప్ మాదేనంటున్న అభిమానులు
1992లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ మరోసారి ఆ మ్యాజిక్ను పునరావృతం చేయనుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు కారణాలు కూడా వినిపిస్తున్నారు
ఎప్పుడెలా ఆడుతోందో తెలియని జట్టు పాకిస్తాన్. ప్రపంచంలోని అన్ని జట్ల ఆటతీరును అంచనా వేయగలిగే క్రీడా విశ్లేషకులు .. పాక్ విషయంలో మాత్రం బొక్కబొర్లాపడుతుంటారు. తాజా ప్రపంచకప్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు.. టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్కు షాకిచ్చింది.
దీంతో పాక్ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 1992లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ మరోసారి ఆ మ్యాజిక్ను పునరావృతం చేయనుందని వారు బలంగా నమ్ముతున్నారు.
ఇందుకు కారణాలు కూడా వినిపిస్తున్నారు. సర్ఫరాజ్ నేతృత్వంలోని పాక్ జట్టు ఈ ప్రపంచకప్లో మంచి ఆరంభాన్ని సంపాదించలేకపోయింది. తొలి మ్యాచ్లో విండీస్ చేతిలో ఘోర పరాజయం తర్వాత రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించింది.
తదుపరి శ్రీలంకతో ఆడాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. కాగా 1992లోనూ పాక్కు ఇదే రకమైన పరిస్ధితి కనిపించింది. ఆ టోర్నీని కూడా రౌండ్ రాబిన్ పద్దతిలోనే ప్రవేశపెట్టారు. తొలి మ్యాచ్లో వెస్టిండీస్తోనే తలపడిన పాక్.. పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
అనంతరం రెండో మ్యాచ్లో జింబాబ్వేతో గెలిచింది. ఇంగ్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత వరుస పెట్టి మ్యాచ్లు గెలుస్తూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ జట్టు ప్రపంచకప్ను ముద్దాడింది. అప్పటి పరిస్ధితులే ఇప్పుడు కూడా కనిపిస్తుండటంతో మరోసారి తమ జట్టు ప్రపంచకప్ను గెలుస్తుందని పాకిస్తాన్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.