08:46 PM (IST) Feb 13

ముగిసిన వేలం..

ముంబై వేదికగా నేటి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎట్టకేలకు ముగిసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ వేలంలో తొలుత వేలానికి వచ్చిన ప్లేయర్ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఆమెను బెంగళూరు రూ. 3.40 కోట్లతో దక్కించుకుంది. వేలంలోకి చివరగా వచ్చిన ప్లేయర్ సహానా పవార్. సహానా ను కూడా బెంగళూరే దక్కించుకోవడం గమనార్హం. ఆమెకు రూ. 10 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. 

08:43 PM (IST) Feb 13

గుజరాత్ టీమ్ :

ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్ 

08:43 PM (IST) Feb 13

ఆర్సీబీ టీమ్ :

స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా, డేన్ వన్ నీకర్క్, పూనమ్ ఖేమ్నర్, అశ్విన్ కుమారి, ప్రీతి బోస్, హెథర్ నైట్, మేగన్ షూట్, సహనా పవార్ 

08:42 PM (IST) Feb 13

ముంబై టీమ్ :

హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్‌‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్, హీలి మాథ్యూస్, హుమైరా కాజి, ప్రియాంక బాలా, చోల్ టైరన్, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్త్ 

08:30 PM (IST) Feb 13

ఢిల్లీ టీమ్ :

తొలి రెండు, మూడు సెట్ లలో ప్లేయర్లను కొనుగోలు చేయడంలో పెద్దగా ఆసక్తి చూపని ఢిల్లీ తర్వాత పుంజుకుంది. మార్కీ సెట్ ప్లేయర్లు ముగిసిన తర్వాత చకచకా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఢిల్లీ 18 మందిని దక్కించుకుంది. 

జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్, అపర్ణా మండల్, స్నేహ్ దీప్తి, పూనమ్ యాదవ్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుందతి రెడ్డి

08:20 PM (IST) Feb 13

యూపీ టీమ్ ఇదే..

డబ్ల్యూపీఎల్ లో యూపీ పర్స్ ఖాళీ అయింది. ఆ టీమ్ ఖాతాలో మిగిలున్న రూ. 10 లక్షలను సిమ్రాన్ షేక్ ను కొనుగోలు చేసింది. పర్స్ ఖాళీ అయ్యాక యూపీ జట్టు ఇలా ఉంది. 

సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్‌గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రాన్ షేక్ 

నిబంధనల ప్రకారం ఒక జట్టు 15 నుంచి 18 మెంబర్స్ ను తీసుకోవచ్చు. వేలంలో యూపీ 16 మందిని కొనుగోలు చేసింది.

08:10 PM (IST) Feb 13

హీలి మాథ్యూస్, హెథర్ నైట్ ఎట్టకేలకు..

వెస్టిండీస్ సారథి హేలీ మాథ్యూస్ ను తొలి దశ వేలంలో పట్టించుకోని ఫ్రాంచైజీలు.. తుది దశలో మాత్రం ముంబై రూ. 40 లక్షలకు దక్కించుకుంది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ హెథర్ నైట్ ను రూ. 40 లక్షలకు సొంతం చేసుకుంది. తాన్యా భాటియా రూ. 30 లక్షలకు ఢిల్లీ తరఫున ఆడనుంది. సుష్మా వర్మ ను రూ. 60 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. 

08:04 PM (IST) Feb 13

ఆర్సీబీ స్క్వాడ్..

ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక ధర దక్కించుకున్న స్మృతి మంధాన (రూ. 3.40 కోట్లు) ఆర్సీబీకి సారథిగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్సీబీ టీమ్ ఇదే. 

స్మృతి మంధాన, సోఫీ డివైన్, పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా 

08:01 PM (IST) Feb 13

ఢిల్లీ టీమ్..

మరో సెషన్ మిగిలిఉన్న వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్లే.. 

జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్ 

07:59 PM (IST) Feb 13

గుజరాత్ టీమ్..

డబ్ల్యూపీఎల్ వేలంలో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ టీమ్ కు ఇప్పటివరకు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా.. 

ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్ 

07:50 PM (IST) Feb 13

ముంబై స్క్వాడ్ ఇదే..

ఇప్పటివరకు ముగిసిన వేలంలో ముంబై కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే.. 

హర్మన్‌ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్

07:45 PM (IST) Feb 13

మిగిలిన స్లాట్లు..

చివరి సెషన్ కంటే ముందు టీమ్ లు, వాటి వద్ద ఉన్న పర్స్ వాల్యూ, స్లాట్ల వివరాలు.. (నిబంధనల ప్రకారం జట్టులో కనీసం 15 మందిని, గరిష్టంగా 18 మందిని తీసుకోవచ్చు)

ఢిల్లీ క్యాపిటల్స్ : మిగిలిన పర్స్ రూ. 2.15 కోట్లు. మరో ముగ్గురిని తీసుకోవచ్చు. 
గుజరాత్ : పర్స్ లో రూ. 1.30 కోట్లున్నాయి. ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ఉంది.
ముంబై : పర్స్ లో రూ. 1.30 కోట్లు మిగిలాయి. ఐదుగురిని తీసుకోవచ్చు. 
ఆర్సీబీ : పర్స్ లో రూ. 1.95 కోట్లు ఉన్నాయి. నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంది. 
యూపీ : పర్స్ లో రూ. 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. 15 మందిని ఎంపిక చేసుకున్నారు. 

07:38 PM (IST) Feb 13

యూపీ జట్టు ఇదే..

డబ్ల్యూపీఎల్ లో యూపీ పర్స్ ఖాళీ అయింది. ఆ టీమ్ ఖాతాలో మరో రూ. 10 లక్షలు మాత్రమే మిగిలాయి. ఆ జట్టును ఓసారి పరిశీలిస్తే.. 

సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్‌గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్ 

మిగిలి ఉన్న నగదు : రూ. 10 లక్షలు 
మిగిలిన స్లాట్లు : 3 
ఓవర్సీస్ స్లాట్లు : 0 

07:31 PM (IST) Feb 13

వేగం పెంచిన యాక్షనీర్..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రధాన ప్లేయర్ల వేలం ప్రక్రియ ముగియడంతో యాక్షనీర్ డబ్ల్యూపీఎల్ యాక్షన్ వేగం పెంచారు. 45 నిమిషాల విరామం తర్వాత సుమారు 150 మంది ప్లేయర్ల వేలం ముగిసింది. వీరిలో చాలా మంది అన్ సోల్డ్ గానే మిగిలారు. మిగిలిన వారిని మరో 15 నిమిషాల తర్వాత తుది దశ వేలంలో ముగించనున్నారు.

Scroll to load tweet…

07:20 PM (IST) Feb 13

యూపీ ఖాతా ఖాళీ..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో యూపీ వారియర్స్ పర్స్ ఖాళీ అయింది. ఇప్పటికే ఆ జట్టు 15 మందిని కొనుగోలు చేసింది. ఆ జట్టు వద్ద ఇంకా పది లక్షల రూపాయలు మాత్రమే మిగిలాయి. మిగిలిన రూ. 10 లక్షలలో ఆ జట్టు కొనుగోలు చేయాలనుకుంటే మరో ఒక ప్లేయర్ మాత్రమే దక్కనుంది. 

07:11 PM (IST) Feb 13

మిగిలిఉంది ఇదే..

ఆసక్తికరంగా సాగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు అన్ని టీమ్ ల వద్ద మిగిలి ఉన్న నగదు ఇదే.. 

ఢిల్లీ : రూ. 3.20 కోట్లు 
ముంబై : రూ. 2,10 కోట్లు 
గుజరాత్ :రూ. 1.50 కోట్లు
బెంగళూరు : రూ. 2.70 కోట్లు 
యూపీ : రూ. 20 లక్షలు 

07:07 PM (IST) Feb 13

అమన్ జ్యోత్ కౌర్..

టీమిండియా బ్యాటర్ అమన్ జ్యోత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు దక్కించుకుంది. ఢిల్లీ పోటీపడ్డా విఫలమైంది. 

07:06 PM (IST) Feb 13

అనూజా పాటిల్ అన్ సోల్డ్..

టీమిండియా క్రికెటర్లు అనూజా పాటిల్ తో పాటు సిమ్రాన్ బహదూర్ లు అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్ దేవికా వైద్య ను రూ. 1.40 కోట్లతో యూపీ వారియర్స్ టీమ్ దక్కించుకుంది. దేవికా కోసం యూపీ, ఢిల్లీలు పోటీ పడ్డాయి. 

07:01 PM (IST) Feb 13

అలీస్ క్యాప్సీ..

అలీస్ క్యాప్సీ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు దక్కించుకోగా ఇసాబెల్లె వాంగ్ ను ముంబై రూ. 30 లక్షలకు, మాన్సీ జోషిని గుజరాత్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్నాయి. 

06:57 PM (IST) Feb 13

జార్జియా వెర్హమ్..

ఈ ఆసీస్ క్రికెటర్ కోసం గుజరాత్, బెంగళూరులు పోటీ పడ్డాయి. గుజరాత్ జెయింట్స్ జార్జియాను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.