ఇండియా వర్సెస్ పాకిస్తాన్: 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన పాకిస్తాన్.. 68 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్..
India vs Pakistan T20WC 2023: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మొదటి 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసిన పాక్, భారత ఫీల్డర్ల మిస్ ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్ల కారణంగా ఆఖరి 6 ఓవర్లలో 66 పరుగులు రాబట్టగలిగింది...
6 బంతుల్లో ఓ ఫోర్తో 8 పరుగులు చేసిన జావెరియా ఖాన్ని దీప్తి శర్మ అవుట్ చేసింది. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. ఆ తరవ్ాత కెప్టెన్ బిస్మా మరూఫ్తో కలిసి రెండో వికెట్కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించింది ఓపెనర్ మునీబా ఆలీ..
14 బంతుల్లో ఓ పోర్తో 12 పరుగులు చేసిన మునీబా ఆలీ, రాధా యాదవ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యింది. ఆ తర్వాత నిదా దర్ని డకౌట్ చేసింది పూజా వస్త్రాకర్.18 బంతుల్లో 11 పరుగులు చేసిన సిద్రా ఆమీన్, రాధా యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యింది.
68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ జట్టును బిస్మా మరూఫ్, అయేషా నసీం కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కి 81 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 పరుగులు చేయగా అయేషా నసీం 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసింది...
ఎక్స్ట్రాల రూపంలో పాకిస్తాన్కి మరో 7 పరుగులు అదనంగా వచ్చాయి. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు తీయగా దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్లకు తలా ఓ వికెట్ దక్కింది. పూర్తి ఓవర్ల కోటా ముగించేందుకు షెడ్యూల్ సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది టీమిండియా. దీంతో ఆఖరి ఓవర్లో మరో ఫీల్డర్, 30 గజాల సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నేటి మ్యాచ్లో బరిలో దిగడం లేదు. చేతి వేలి గాయంతో బాధపడుతున్న స్మృతి మంధాన లేని లోటు భారత బ్యాటింగ్ ఆర్డర్పై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఉన్న కారణంగా నేటి మ్యాచ్, భారత ప్లేయర్లకు కీలకంగా మారింది...
