Asianet News TeluguAsianet News Telugu

నా నేరంలో పార్ట్ నర్ ఇతడే... కోహ్లీ ట్వీట్ వైరల్

ఆ ఫోటోలో ఉంది ధోనీ అంటూ నెటిజన్లంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. మరికొందరేమో.. ధోనీ తిరిగి జట్టులోకి రాబోతున్నాడని.. వెస్టిండీస్ మ్యాచ్ లో ధోనీ ఆడబోతున్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

Virat Kohli posts nostalgic post about partner in crime MS Dhoni
Author
Hyderabad, First Published Nov 21, 2019, 10:25 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ నేరం చేశారట. ఆ నేరంలో మరో క్రికెటర్ కి భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. తన క్రైమ్ పార్ట్ నర్ ఇతనే అంటూ ఓ ఫోటో పోస్టు చేశాడు. కాగా... కోహ్లీ పోస్టు చేసిన ఆ ఫోటో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... వర్షం లో కోహ్లీ తడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో ధోనీ వెనక నుంచి నిలబడి ఉన్నారు. ‘నా నేరంలో భాగస్వామి.. బౌండరీ వద్ద ఫీల్డర్ల నుంచి సింగిల్స్ స్థానంలో డబుల్స్ దోచుకున్నాం. అతను ఎవరో తెలుసా..?’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు.

కాగా... ఆ పోస్టుకి నెటిజన్ల స్పందన చాలా పాజిటివ్ గా ఉంది. కామెంట్ల వర్షం కురిపించారు. ఆ ఫోటోలో ఉంది ధోనీ అంటూ నెటిజన్లంతా ముక్త కంఠంతో పేర్కొన్నారు. మరికొందరేమో.. ధోనీ తిరిగి జట్టులోకి రాబోతున్నాడని.. వెస్టిండీస్ మ్యాచ్ లో ధోనీ ఆడబోతున్నాడంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ల కోసం గురువారం జట్లను ప్రకటించే అవకాశం ఉంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్  నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ ఈరోజు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమై.. జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫోటో పోస్టు చేయడంతో.. జట్టులో ధోనీకి మళ్లీ అవకాశం ఇస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios