Asianet News TeluguAsianet News Telugu

భారత క్రికెట్ లో అత్యంత దురదృష్టవంతులు.. ఒకే మ్యాచ్ తో కెరీర్ ను ముగించింది వీరే

Team India : దేశ‌వాళీతో పాటు ఇత‌ర ఫార్మాట్ల‌లో స‌త్తా చాటి భారతదేశం తరపున వన్డే ఇంటర్నేషనల్ ఆడేందుకు ప‌లువురు భారతీయ స్టార్ క్రికెటర్లకు అవ‌కాశం వ‌చ్చింది. కానీ, అదే మ్యాచ్ వారి చివరి మ్యాచ్ అయింది. అలాంటి  దురదృష్టవంతులైన ఐదుగురు క్రికెట‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

They are the most unlucky people in Indian cricket.. They are the ones who ended their career with only one match RMA
Author
First Published Aug 25, 2024, 9:43 PM IST | Last Updated Aug 25, 2024, 9:43 PM IST

Team India : కేవలం ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ముగించిన దేశీయ స్టార్ క్రికెట‌ర్లు ఉన్నారు. దేశ‌వాళీ క్రికెట్ లో అద‌ర‌గొట్టిన ప్లేయ‌ర్లు కేవ‌లం ఒక‌ వన్డేతో కెరీర్ ను ముగించిన న‌లుగురు దుర‌దృష్ట‌వంతులైన భారతీయ క్రికెటర్లు ఉన్నారు. బహుశా ఈ క్రికెటర్ల విధిలో భారత్ తరఫున బ్లూ జెర్సీలో ఎక్కువ క్రికెట్ ఆడాలని రాసి ఉండకపోవచ్చు. ప్రతి క్రికెటర్ తన దేశం కోసం ఒకసారి క్రికెట్ ఆడి ఎంతో పేరు సంపాదించాలని కలలు కంటాడు. కానీ భారతదేశం తరపున వన్ డే ఇంటర్నేషనల్, టెస్టు తొలి మ్యాచ్ తోనే కెరీర్ ముగించిన క్రికెట‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. పర్వేజ్ రసూల్ 

30 ఏళ్ల పర్వేజ్ రసూల్ జమ్మూ కాశ్మీర్‌లో 13 ఫిబ్రవరి 1989న జన్మించిన ఆల్ రౌండర్ ఆటగాడు. పర్వేజ్ రసూల్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్, ఆఫ్-బ్రేక్ బౌలర్. ఐపీఎల్ 2014 వేలంలో పర్వేజ్ రసూల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ₹95 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఆడే అవకాశం పొందిన జమ్మూ కాశ్మీర్‌కు చెందిన తొలి క్రికెటర్ పర్వేజ్ రసూల్. పర్వేజ్ రసూల్ 15 జూన్ 2014న మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన భారత క్రికెట్ జట్టు కోసం తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అయితే అతని మొదటి, చివ‌రి వ‌న్డే మ్యాచ్ గా మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో పర్వేజ్ రసూల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు కానీ బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు.

2. పంకజ్ సింగ్

పంకజ్ సింగ్ 5 జూన్ 2010న శ్రీలంకతో తన కెరీర్‌లో మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అయితే అతని మొదటి మ్యాచ్ అతని చివరి మ్యాచ్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో 6 మే 1985లో జన్మించిన పంకజ్ సింగ్ ఒక ఫాస్ట్ బౌలర్. శ్రీలంకపై పంకజ్ సింగ్ 42 బంతుల్లో 45 పరుగులు ఇచ్చాడు, కానీ ఒక్క వికెట్ కూడా తీయలేక‌పోయాడు. అదే అత‌ని చివ‌రి వ‌న్డేగా మారింది.

3. ఫైజ్ ఫజల్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 7 సెప్టెంబర్ 1985న జన్మించిన ఫైజ్ ఫజల్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. గతంలో సెంట్రల్ జోన్, ఇండియా రెడ్, ఇండియా అండర్-19, రైల్వేస్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన విదర్భ క్రికెట్ జట్టుకు ఆడాడు. 2015–16 దేవధర్ ట్రోఫీలో ఫైజ్ ఫజల్ ఇండియా బితో జరిగిన ఫైనల్‌లో ఇండియా ఎ తరఫున 112 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 2015-16 ఇరానీ కప్‌లో 127 పరుగులతో అద‌ర‌గొట్టాడు. 2018-19 దులీప్ ట్రోఫీకి ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫైజ్ ఫజల్ 2016 లో జింబాబ్వేతో తన మొదటి వ‌న్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఇందులో అతను 61 బంతుల్లో 90.16 స్ట్రైక్ రేట్‌తో 55 పరుగులు చేశాడు. అయితే, అదే అత‌ని మొద‌టి, చివ‌రి మ్యాచ్ గా మిగిలిపోయింది. 

4. బీ.ఎస్. చంద్రశేఖర్

బీ.ఎస్. చంద్రశేఖర్ 16 ఏళ్ల కెరీర్‌లో 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి 29.74 సగటుతో 242 వికెట్లు తీశాడు. తన మొత్తం టెస్టు, ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో సాధించిన పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్ చంద్రశేఖర్. 1972లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. చంద్రశేఖర్ 1972లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2002లో భారతదేశానికి విస్డెన్ అవార్డును గెలుచుకున్నాడు. చంద్రశేఖర్ 1976లో న్యూజిలాండ్‌తో త‌న తొలి వన్డే మ్యాచ్ ఆడాడు, అందులో అతను బౌలింగ్‌లో 12 సగటుతో 36 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. అతను బ్యాటింగ్‌లో 13 బంతుల్లో 11 పరుగులు చేశాడు.

5. ఇక్బాల్ సిద్ధిఖీ 

తను ఆడే రోజుల్లో  స్టార్ ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఇక్బాల్ సిద్ధిఖీ దురదృష్టవశాత్తూ 2001 సంవత్సరంలో భారతదేశం తరపున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మొహాలీలో ఇంగ్లండ్‌తో ఆడాడు. అద్భుత‌మైన ఫాస్ట్ బౌలింగ్ తో గ్రేమ్ థోర్ప్‌ను అతని తొలి వికెట్‌గా ప‌డ‌గొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇక్బాల్ 10వ నంబర్‌లో బ్యాటింగ్ చేసి 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు కేవలం 5 పరుగులు కావాల్సిన సమయంలో క్రికెటర్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వ‌చ్చాడు. దురదృష్టవశాత్తూ అత‌నికి అదే చివ‌రి మ్యాచ్ అయింది. మొత్తంమీద అతని ఫస్ట్-క్లాస్ రికార్డు పరంగా ఇక్బాల్ సిద్ధిఖీ మొత్తం 90 మ్యాచ్‌లు ఆడి 315 వికెట్లు పడగొట్టాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios