సరేండర్ ఇచ్చేయండి యార్... అయితే కొంచెమైనా పోరాటం చూపించాలి కదా...
19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్...
భారత ఇన్నింగ్స్ అనంతరం భారత బ్యాట్స్మెన్ స్కోరును ఉద్దేశిస్తూ OTP ట్వీట్...
పింక్ బాల్ టెస్టు మ్యాచులో టీమిండియా ఘోర పరాజయానికి సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా తన హాస్యచతురత చూపించే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... మరోసారి తన టైమింగ్ చూపించాడు.
19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మొదటి ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్... మరీ ఇంతలా సరేండర్ అవ్వాలా? అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్తో ఉన్న ఫోటోను పోస్టు చేశాడు...
19/6 , the earliest 6 wickets India have lost in their test history.
— Virender Sehwag (@virendersehwag) December 19, 2020
Surrender kar diye bilkul yaar.
Par thodi umeed abhi bhi karni chahiye, kya pata, kuch jaadoo ho jaaye. pic.twitter.com/89r8z20ef8
‘19/6... భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి త్వరగా 6 వికెట్లు కోల్పోవడం... సరేండర్ ఇచ్చేయండి యార్... అయితే కొంచెమైనా పోరాటం చూపించాలి కదా... ఎవరికి తెలుసు.. ఏదైనా అద్భుతం జరగుతుందేమో’ అంటూ ట్వీట్ చేశాడు.
త్వరగా 6 వికెట్లు కోల్పోయినా భారత జట్టు కనీసం 120+ స్కోరు చేస్తుందని భావించి, వీరూ ఈ ట్వీట్ చేశాడు. అయితే 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ముగించిన తర్వాత భారత బ్యాట్స్మెన్ పరుగులను తెలుపుతూ... ‘49204084041 మనం మరిచిపోవాల్సిన OTP...’ అంటూ ట్వీట్ చేశాడు వీరూ. ఈ ట్వీట్కి బీభత్సమైన స్పందన వచ్చింది.
The OTP to forget this is 49204084041 .#INDvsAUSTest
— Virender Sehwag (@virendersehwag) December 19, 2020
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
Last Updated Dec 19, 2020, 5:36 PM IST