Asianet News TeluguAsianet News Telugu

ఆడుతూ పాడుతూ కొట్టేసిన ఇంగ్లాండ్... జోస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌తో...

8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన ఇంగ్లాండ్...

2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్...

బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ టీమిండియా ఘోరమైన ప్రదర్శన...

Team India lost Second T20I, After jos butler winning innings for England CRA
Author
India, First Published Mar 16, 2021, 10:37 PM IST

టీమిండియా విధించిన 157 పరుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కొట్టేసింది ఇంగ్లాండ్ జట్టు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన ఇంగ్లీష్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్బుత ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌కి విజయాన్ని అందించాడు.

గత రెండు మ్యాచుల్లో 40+ పరుగులు చేసిన జాసన్ రాయ్‌ 13 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు జోస్ బట్లర్. 17 బంతుల్లో ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, సుందర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత టీమిండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌తో అనవసర తప్పిదాలు చేసిన టీమిండియా, భారీ మూల్యం చెల్లించుకుంది. 

బెయిర్ స్టో 28 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios