విరాట్ కోహ్లీ కంటే అతనే నాకు బాగా క్లోజ్... టీమిండియా కొత్త కెప్టెన్పై యజ్వేంద్ర చాహాల్ కామెంట్స్...
రోహిత్ శర్మ నాకు అన్నలాంటివాడు... అతని కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా... భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీతో టీమిండియాలో ఓ శకానికి తెరపడినట్టైంది. టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ పదవిలో ఉన్న రవిశాస్త్రి తన కాంట్రాక్ట్ పూర్తి చేసుకోవడంతో న్యూజిలాండ్తో జరిగే సిరీస్ నుంచి కొత్త కెప్టెన్, కొత్త హెడ్ కోచ్ సారథ్యంలో బరిలో దిగనుంది భారత జట్టు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ, టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు అందుకోబోతుంటే, హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోబోతున్నాడు.
తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, కొత్త కెప్టెన్ రోహిత్ శర్మతో తనకున్న అనుబంధం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు... ‘మా ఇద్దరి మధ్య అనుబంధం క్రికెట్కి అతీతమైనది. రోహిత్ శర్మకు నాకు ఉన్న స్నేహం, క్రీజులో కూడా మా ఇద్దరి ఆటతీరును ప్రభావితం చేస్తుందని భావిస్తున్నా. నేను, నా జీవితానికి సంబంధించిన ప్రతీ విషయం గురించి రోహిత్తో పంచుకుంటూ ఉంటాను... అతనితో షేర్ చేసుకున్న ప్రతీసారి, ఓ పాజిటివ్ అనుభూతి మిగులుతుంది...
రోహిత్ శర్మతో నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతను మా కుటుంబంలో ఒకడు. రోహిత్తో పాటు రితికా బాబీతో కూడా మంచి అనుబంధం ఉంది. వాళ్లు ఓ తమ్ముడిలా నన్ను చూసుకుంటారు. మేం చాలాసార్లు కలిసి డిన్నర్లకు కూడా వెళ్తుంటాం... ’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్...
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడే యజ్వేంద్ర చాహాల్కి, విరాట్ కోహ్లీకి మధ్య మంచి అనుబంధం ఉందని అనుకుంటారంతా. అయితే కోహ్లీతో కంటే రోహిత్ శర్మతోనే యజ్వేంద్ర చాహాల్కి క్లోజ్నెస్ ఎక్కువ. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావుడి క్రియేట్ చేశాయి...
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా జరుపుకున్న పార్టీలో పాల్గొన్న యజ్వేంద్ర చాహాల్, రోహిత్ శర్మ ‘సెనోరిటా’ పేరుతో ఓ రొమాంటిక్ ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలకి రితికా శర్మ, యజ్వేంద్ర చాహాల్ భార్య ధనుశ్రీ వర్మ ఇచ్చిన కామెంట్లు కూడా తెగ వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ పుట్టినరోజున ‘లవ్ ఆఫ్ మై లైఫ్, హ్యాపీ బర్త్ డే రోహిత్... శర్మ...’ అంటూ యజ్వేంద్ర చాహాల్ చేసిన పోస్టుపై రితికా శర్మ... ‘ఓఎమ్జీ’ రేంజ్లో రియాక్షన్ ఇస్తూ ఎమోజీ కామెంట్ చేసింది.
యజ్వేంద్ర చాహాల్, రోహిత్ శర్మ మధ్య బ్రొమాన్స్పై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా సందడి చేశాయి. టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్ చోటు దక్కించుకోలేకపోయాడు...
నాలుగేళ్లుగా టీ20ల్లో టీమిండియాకి ప్రధాన స్పిన్నర్గా సేవలు అందిస్తున్న యజ్వేంద్ర చాహాల్ను కాదని రాహుల్ చాహార్కి టీ20 వరల్డ్కప్ టీమ్లో చోటు ఇవ్వడం వివాదాస్పదమైంది.
అయితే చాహాల్ స్థానంతో టీ20 వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న రాహుల్ చాహార్, నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో మాత్రమే ఆడాడు. మిస్టరీ స్పిన్నర్గా టీ20 వరల్డ్కప్ టోర్నీని ఆరంభించిన వరుణ్ చక్రవర్తి, టోర్నీలో మూడు మ్యాచులు ఆడినా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వరుణ్ చక్రవర్తికి న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కి ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.