చెన్నైలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ లో జైపూర్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. యూపీ యోదాస్ తో తలపడ్డ పాంథర్స్ జట్టు 7 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయయాత్రకు యూపీ యోదాస్ బ్రేక్ వేసింది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జైపూర్ ఈ సీజన్లో రెండో ఓటమిని చవిచూసింది. కేవలం 7 పాయింట్ల తేడాతో యూపీ విజయాన్ని అందుకుంది. పాంథర్స్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా 9 పాయిట్లతో టాప్ స్కోరర్ గా నిలిచిన జట్టను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
యూపీ ఆటగాళ్ల సమిష్టి పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు. సురేందర్ గిల్ 8, శ్రీకాంత్ జాదవ్ 7, రిశాంక్ దేవడిగ 4, సుమిత్ 4 పాయింట్లతో అదరగొట్టారు. మిగతావారిలో నితేశ్ 2, మోహసెన్ 2,అ అశు 1, అమిత్ లు 1 పాయింట్ సాధించారు. ఇలా రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 11, ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడం ద్వారా 2 ఇలా మొత్తం 31 పాయింట్లు సాధించి పింక్ పాంథర్స్ పై ఆధిక్యాన్ని ప్రదర్శిచింది.
పాంథర్స్ జట్టులో స్టార్ రైడర్ దీపక్ ఒక్కడే 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అలాగే విశాల్ 4, నితిన్ 4, దీపక్ 2 పాయింట్లు సాధించారు. అయినప్పటికి ప్రత్యర్థి కంటే 7 పాయింట్లు వెనుకబడి ఓటమిపాలయ్యింది.
పాంథర్స్ రైడింగ్ లో కేవలం 15, ట్యాకిల్స్ లో 9, ఎక్స్ట్రాల రూపంలో 1 ఇలా అన్నిట్లోనూ యూపీ కంటే తక్కువ పాయింట్లు సాధించింది. దీంతో 31-24 తేడాతో యూపీ యోదాస్ విజయాన్ని అందుకోగలిగింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 20, 2019, 12:46 PM IST