మాట నిలపెట్టుకున్న ప్రధాని మోదీ.. సింధూకి ఐస్ క్రీమ్.. నీరజ్ కి చుర్మా..!
ఈ సందర్భంగా సింధుకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని తెలుసుకున్నారు. అప్పుడు పతకం గెలిస్తే.. ఐస్ క్రీమ్ నీతో కలిసి తింటాను అని మాబట ఇచ్చారు. దానిని ఇప్పుడు నిజం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ తాను ఇచ్చిన మాట నిలపెట్టుకున్నారు. గతంలో తాను చెప్పినట్లుగానే.. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. ఇక భారత్ కి స్వర్ణం కల నెరవేర్చిన జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాకి ఎంతో ఇష్టమైన చుర్మాను కూడా అందించారు.
స్వాంత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ తన నివాసంలో ఒలంపిక్స్ అథ్లెట్స్ కి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు చేసిన కృషిని అభినందించారు.. వారి విజయాలను ప్రశంసించారు.
అథ్లెట్స్ కి ఒలంపిక్స్ కి వెళ్లడానికి మందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సమయంలో వారందరి అభిరుచులను మోదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింధుకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని తెలుసుకున్నారు. అప్పుడు పతకం గెలిస్తే.. ఐస్ క్రీమ్ నీతో కలిసి తింటాను అని మాబట ఇచ్చారు. దానిని ఇప్పుడు నిజం చేశారు.
మోదీ అథ్లెట్స్ అందరికీ తన ఇంటి వద్ద అల్పాహార విందు ఇచ్చారు. ఇదే సమయంలో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్ క్రీం తిన్నారు. ఆమెతో కాసేపు మాట్లాడారు
టోక్యో బ్యాడ్మింటన్లో గెలుచుకున్న బ్రాంజ్తో పాటు.. గతంలో రియో ఒలింపిక్స్లో సాధించిన పతకాన్ని కూడా ఈ సందర్భంగా సింధు తన వెంట తీసుకెళ్లింది. ఆ రెండింటిని ధరించి.. ప్రధాని మోదీతో కలిసి ఆమె ఫోటో దిగింది.
ఇక జావెలిన్ త్రోలో.. అదరగొట్టి.. దేశానికి స్వర్ణం కల తీర్చిన నీరజ్ చోప్రాతో కొద్దిసేపు మోదీ ముచ్చటించారు. అనంతరం అతనితో కలిసి ఫోటో దిగారు. తనకు చూర్మ వంటకమంటే ఇష్టమని నీరజ్ చెప్పడంతో.. దాన్ని సిద్ధం చేయించారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.