‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విజేతకు బహుమతిగా ఐదు లీటర్ల పెట్రోల్... కాంగ్రెస్ పార్టీ వినూత్న...
భోపాల్లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన...
క్రికెట్ టోర్నీ నిర్వహించిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విజేతకు 5 లీటర్ల పెట్రోల్...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెట్రోల్ ప్రైజ్...
దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును టచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెంచరీ మార్కు టచ్ చేసిన పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలు, ప్రజలు వివిధ రీతుల్లో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. తాజాగా భోపాల్లో ఓ మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన క్రికెటర్కి 5 లీటర్ల పెట్రోల్ను బహుమతిగా అందించడం హాట్ టాపక్ అయ్యింది.
భోపాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఓ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన క్రికెటర్ సలావుద్దీన్ అబ్బాసీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. అతనికి కానుకగా 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ను అందచేసింది కాంగ్రెస్.
సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అధికార పక్షాన్ని విమర్శించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ క్రికెట్ టోర్నీ నిర్వహించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!