మిథాలీరాజ్ ఖాతాలో మరో అద్భుత రికార్డు... తొలి మహిళా క్రికెటర్గా...
వన్డే క్రికెట్లో 7 వేల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్గా మిథాలీరాజ్ రికార్డు...
వన్డేల్లో 6 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక మహిళ క్రికెటర్గా మిథాలీరాజ్...
భారత వన్డే టీమ్ కెప్టెన్, ‘లేడీ సచిన్’ మిథాలీరాజ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేసింది మిథాలీరాజ్.
గత మ్యాచ్లో ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్గా నిలిచిన మిథాలీరాజ్, దక్షిణాఫ్రికాతో జరగుతున్న నాలుగో వన్డేలో 71 బంతులాడి 4 ఫోర్లతో 45 పరుగులు చేసింది.
26 పరుగుల వద్ద వన్డేల్లో 7 వేల మైలురాయి అందుకున్న మిథాలీరాజ్, మహిళల క్రికెట్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ 5992 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిందా క్లార్క్ 4844 పరుగులతో మూడో స్థానంలో ఉంది.