Asianet News TeluguAsianet News Telugu

MIvsRCB: సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్... ప్లేఆఫ్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్...

కసిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్... మరోసారి అద్భుత హాఫ్ సెంచరీతో ముంబై విజయంతో కీలక పాత్ర...

2020 సీజన్‌లో ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్...

8వ సారి ప్లేఆఫ్‌కి చేరిన ముంబై ఇండియన్స్... 

సిరాజ్, చాహాల్‌లకి చెరో రెండు వికెట్లు...

MI vs RCB: Suryakumar yadav excellent half century helps to mumbai to qualify play-offs CRA
Author
India, First Published Oct 28, 2020, 10:58 PM IST

IPL 2020: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ప్లేఆఫ్ బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి, ప్లేఆఫ్ చేరుకుంది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరడం ఐపీఎల్ చరిత్రలో ఇది 8వ సారి.

165 పరుగుల సాధారణ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... సూర్యకుమార్ యాదవ్ సూపర ఇన్నింగ్స్ కారణంగా ఈజీ విక్టరీ కొట్టింది. డి కాక్ 18, ఇషాన్ కిషన్ 25, సౌరబ్ తివారి 5, కృనాల్ పాండ్యా 10 పరుగులు చేసి అవుట్ కాగా... సూర్యకుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 

107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సూర్యకుమార్ యాదవ్. పాండ్యా 17 పరుగులకి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ బంతుల్లో 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్‌కి చెరో 2 వికెట్లు తీయగా క్రిస్ మోరిస్‌కి ఓ వికెట్ దక్కింది. ఈ ఓటమితో బెంగళూరు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ కావాలంటే మిగిలిన రెండు మ్యాచుల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios