టీమిండియా ఘోరవైఫల్యం.. ఆనందంలో జేమ్స్ అండర్సన్
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 78 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. కాగా.. ఈ టెస్టు ఇన్నింగ్స్ లో టీమిండియా వైఫల్యాన్ని.. ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ ఎక్కువగా ఆస్వాదించాడు
లార్డ్స్ లో అసాధారణ విజయం సాధించిన టీమిండియా.. మూడో టెస్టులో డీలా పడిపోయింది. గత మ్యాచ్ లో అద్భుత పోరాటంతో గెలిచిన జట్టు ఇదేనా అనే అనుమానం కలిగేలా.. బ్యాట్స్ మెన్లు దారుణంగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ , మిడిల్ ఆడర్డర్, లోయర్ ఆర్డర్.. ఏదీ నిలవలేకపోయింది. ఇంగ్లాండ్ మాయాజలం ముందు.. టీమిండియా కుప్పకూలిపోయింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 78 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. కాగా.. ఈ టెస్టు ఇన్నింగ్స్ లో టీమిండియా వైఫల్యాన్ని.. ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ ఎక్కువగా ఆస్వాదించాడు కోహ్లీ ఓటమిని.. అతను సెలబ్రేట్ చేసుకున్నాడు.
లార్డ్స్ టెస్టులో విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్లో నాలుగో రోజైన ఆదివారం క్రీజులో ఉన్నంతసేపు విరాట్ కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడేస్తూ కనిపించాడు. దాంతో.. అతని ఏకాగ్రతని దెబ్బతీసేందుకు అండర్సన్ తొలుత నోరు జారగా.. విరాట్ కోహ్లీ కూడా అదేరీతిలో బదులిచ్చాడు. కాగా నాటి సంఘటన తర్వాత... నేడు ఆండర్సన్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపిస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ ఔట్ కాగానే.. జేమ్స్ అండర్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. అతను సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంగ్లాండ్ క్రికెట్ తమ ట్విట్టర్ లో.. జేమ్స్ అండర్సన్ ఆనందంగా ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం గమనార్హం.