Asianet News TeluguAsianet News Telugu

IPL2021 DC vs RR: నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... శ్రేయాస్ అయ్యర్ అవుట్...

మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్... 24 పరుగులు చేసిన రిషబ్ పంత్, 43 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్...

IPL2021 DC vs RR: Delhi Capitals losses fourth wicket, shreyas iyer goes after scoring decent runs
Author
India, First Published Sep 25, 2021, 4:45 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 90 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది... రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది ఢిల్లీ క్యాపిటల్స్.

8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 12 బంతుల్లో 10 పరుగులు చేసిన పృథ్వీషా కూడా చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 24 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన రిషబ్ పంత్, ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 32 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు...

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే టాప్‌లోకి వెళ్లడమే కాకుండా 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలుస్తుంది...
 

Follow Us:
Download App:
  • android
  • ios