ఐపిఎల్ మ్యాచ్ వేళల్లో మార్పులు: ప్రకటించిన బిసిసిఐ
ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ 12 లో జరిగిన మ్యాచులన్ని రాత్రి ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. శని, ఆదివారం మద్యాహ్నం జరిగిన మ్యాచులను మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచులు ఇప్పటివరకు రాత్రి 8 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే ఈ లీగ్ మ్యాచులు ముగిసిన తర్వాత జరగనున్న అన్ని మ్యాచుల టైమింగ్ లో మార్పులు చేపట్టనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు ఆయా మ్యాచులకు సంబంధించిన వివరాలను ఐపిఎల్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చారు.
ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ 12 లో జరిగిన మ్యాచులన్ని రాత్రి ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. శని, ఆదివారం మద్యాహ్నం జరిగిన మ్యాచులను మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచులు ఇప్పటివరకు రాత్రి 8 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే ఈ లీగ్ మ్యాచులు ముగిసిన తర్వాత జరగనున్న అన్ని మ్యాచుల టైమింగ్ లో మార్పులు చేపట్టనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు ఆయా మ్యాచులకు సంబంధించిన వివరాలను ఐపిఎల్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చారు.
ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బిసిసిఐ తాజాగా టైమింగ్స్ ను కూడా మార్చింది. సాధారణంగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచులు ప్లేఆఫ్ నుండి 7.30 గంటలకే ప్రారంభం కానున్నట్లు బిసిసిఐ తెలిపింది. ఇలా అరగంట ముందుగానే మ్యాచ్ లు ప్రారంంభం కానున్నాయని తెలిపింది. ఐపిఎల్ ప్రేక్షకులందరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.
చెన్నై చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్-1, విశాఖ పట్నంలో క్వాలిఫర్-2, ఎలిమినేషన్, హైదరాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నాలుగు మ్యాచులు కూడా అరగంట ముందుగానే ప్రారంభంకానున్నాయి. మే 7వ తేదీన చెన్నైలో, మే 8,10 తేదీల్లో విశాఖలో, మే12ను హైదరాబాద్ లో ఈ మ్యాచులు జరగనున్నాయి.