IPL 2020: సంజూ టాలెంట్కి తగిన గుర్తింపు దక్కలేదు... - షేన్ వార్న్ కామెంట్
సంజూ శాంసన్ ఓ అద్భుతమైన ప్లేయర్...
శాంసన్ లాంటి ప్లేయర్కి భారత జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉంది...
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్ కామెంట్...
RR vs KXIP: రాజస్థాన్ రాయల్స్, తన రెండో మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును ఢీకొనేందుకు సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్లో సిక్సర్లతో విరుచుకుపడిన భారత యంగ్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ నుంచి మరోసారి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఆశిస్తోంది రాజస్థాన్. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సంజూ సూపర్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సంజూ శాంసన్ గురించి చర్చ నడుస్తోంది.
ప్రస్తుత ఐపీఎల్లో ఫెయిల్ అవుతున్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి ఇప్పటికే ఎన్నోసార్లు భారత జట్టులో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, సంజూ శాంసన్ను ఎందుకు పక్కనబెట్టారంటూ తీవ్రంగా డిస్కర్షన్ జరుగుతోంది. మరోసారి శాంసన్పై కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ మెంటర్ షేన్ వార్న్.
‘సంజూ శాంసన్ ఓ అద్భుతమైన ప్లేయర్. అలాంటి ప్లేయర్కి భారత జట్టులో చోటు దక్కకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్ని ఫార్మాట్లల్లో రాణించే సత్తా ఉన్న ఇలాంటి క్రికెటర్లను ఎందుకు పక్కనపెట్టారు...’ అని కామెంట్ చేశాడు షేన్ వార్న్.
టీమిండియా ఫ్యాన్స్ కూడా షేన్ వార్న్ కామెంట్తో ఏకీభవిస్తున్నారు. సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ వేరే దేశంలో పుట్టి ఉంటే, అతనికి దక్కే గౌరవం వేరేలా ఉండేదంటున్నారు ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్.