IPL 2020 ఫైనల్ ఫైట్కి ముందు డ్రెస్సింగ్ రూమ్లో పార్టీ చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్...
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో ఫైనల్ ఫైట్కి ముందు జట్టులో నూతన ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తోన్న కోచ్ రికీ పాంటింగ్ అండ్ కో...
ఓపెనర్ పృథ్వీషా బర్త్ డే సెలబ్రేషన్స్ పార్టీలో చిరునవ్వులు చిందించిన ఢిల్లీ ప్లేయర్లు...
IPL 2020 సీజన్లో తొలిసారి ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఉత్సహంగా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో ఫైనల్ ఫైట్కి ముందు జట్టులో నూతన ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తోంది జట్టు యాజమాన్యం. ఇందులో భాగంగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఓపెనర్ పృథ్వీషా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది ఢిల్లీ క్యాపిటల్స్.
ఈ బర్త్ డే సెలబ్రేషన్స్లో ఢిల్లీ జట్టు సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన స్టోయినిస్, రబాడాతో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ధావన్, పంత్ అందరూ ఈ పార్టీల్లో నవ్వుతూ కనిపించారు. బర్త్ డే బాయ్ పృథ్వీషాకి కేక్ బాత్ చేయించారు ఢిల్లీ టీమ్.
ఈ సీజన్లో 13 మ్యాచులు ఆడిన పృథ్వీషా... కేవలం రెండు హాఫ్ సెంచరీలతో 228 పరుగులు చేశాడు. వరుస మ్యాచుల్లో విఫలం అవుతుండడంతో పృథ్వీషా స్థానంలో స్టోయినిస్ని ఓపెనర్గా తెచ్చింది ఢిల్లీ.
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో బ్యాటింగ్లో అదరగొట్టిన స్టోయినిస్, బౌలింగ్లోనూ మూడు వికెట్లు తీశాడు. మరి ఫైనల్ మ్యాచ్లో 20 ఏళ్ల యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాకి అవకాశం దొరకడం కష్టమే అనిపిస్తోంది.